బిగ్బాస్ ఇంటిలో కంటెస్టెంట్ లు ఎమోషనల్ అయిపోయి కన్నీరు కట్టలు తెచ్చుకుంటుంది. బాగా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండేవారు ఒకసారి గా పాతాళగంగ రేంజ్ లో కన్నీళ్లు పెట్టుకుంటారు. సాఫ్ట్ అనుకున్నవాళ్ళు ధైర్యంగా ఉంటారు. గత సీజన్లో ఏడుపు అంటే ముందుగా శివజ్యోతి గుర్తొచ్చేది. అంతకుముందు మరొక యంగ్ సింగర్ విధంగా పాతాళగంగా పేరును సార్ధకం చేసుకుంది. దీప్తి సునైనా కూడా కొన్ని రోజులు అలానే ఉంది.
ఈ సీజన్లో మొదట మోనాల్ కి ఆ పేరు పెట్టారు కానీ ఆ తర్వాత క్రమంగా సోహెల్ స్థానాన్ని సంపాదించాడు. పదో వారం నామినేషన్ ప్రక్రియ లో చివరికి మెహబూబ్, సోహెల్ మిగిలారు. ముందు రోజు అభిజిత్ సేవ్ అయినట్లు ప్రకటించారు. ఆతర్వాత మిగతా వారిని కూడా సేఫ్ అని ప్రకటించి ప్రాణస్నేహితులు ఇద్దరిని నిలబెట్టారు. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా విడుదలైన ఎపిసోడ్ లో మెహబూబ్. సోహెల్ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయినా కన్నీరు కట్టలు తెంచుకుంటుంది అన్నది మాత్రం వాస్తవం.
హారిక, మొనాల్ సంగతి చెప్పబన్లేదు. పోటీ పడి మరీ ఏడుస్తారు. ఇక మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు అని ప్రకటించడంతో సోహెల్ ఉండబట్టలేక పోయాడు. బోరున ఏడ్చేశాడు. గత సీజన్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు వెళ్లిపోతుంటే ఇంటి సభ్యులు ఏడుస్తుంటే ఏంట్రా వీళ్ళ ఓవరాక్షన్ అనుకునేవాడిని…. కానీ నాకు ఇప్పుడు ఆ బాధ ఏమిటో తెలుస్తుంది అని ఏడుస్తూనే సమాధానం ఇచ్చాడు. ఇక్కడ ఈ గేమ్ లో మైండ్, మనసుతో గొడవ పడాలి అంటూ గుండెలవిసేలా ఏడ్చేశాడు.