బిగ్ బాస్ షో చివరిదశకు చేరుకుంది నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ ల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్నది 8 సభ్యులు. 11వ వారం లో జరిగిన నామినేషన్ ప్రక్రియ అందుకు తగ్గట్టే పోటాపోటీగా జరిగింది. ఒక్కసారిగా ఇంట్లో వాతావరణం వేడెక్కింది. ఒకరిపై ఒకరు విపరీతంగా విరుచుకుపడుతున్నారు. ఎనిమిది మందిలో హారిక, అభిజిత్, లాస్య ఒకవైపు అవినాష్, అరియానా మరొకవైపు ఉన్నారు. ఇక అఖిల్, మోనాల్, సోహెల్ ఒక జట్టుగా ఉన్నారు.
నామినేషన్ లో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనే విషయాన్ని కూడా మనం ఈజీగా ఊహించవచ్చు. హారిక, అభిజిత్ పక్కా నామినేషన్ లో ఉంటారు. అఖిల్ సీక్రెట్ రూమ్ కారణాలు చెబుతూ ఆ గ్రూప్లో నుండి కచ్చితంగాగా నామినేట్ చేస్తారు. ఇక అరియానా, అవినాష్ కూడా దాదాపు అదే గ్రూప్ ని టార్గెట్ చేస్తుంది. ఇవన్నీ పక్కనపెడితే నిన్న మెహబూబ్ కి వెళ్ళినప్పుడు కన్నీళ్లు కార్చి ఎమోషనల్ అయిన సోహెల్ నామినేషన్ల మాత్రం విపరీతంగా ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు తన కోపం వల్ల సోహెల్ విమర్శలు ఎదుర్కొన్నాడు. అదే కారణం వల్ల నామినేట్ అయిన రోజులు కూడా ఉన్నాయి కానీ తర్వాత చాలా ఫన్నీగా మారాడు. నాగార్జున ఇచ్చిన సలహాతో కోపం తగ్గించుకున్నాడు కానీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో లో మళ్లీ పాత అఖిల్ బయటకు వచ్చాడు. అతని పై ఇది విపరీతమైన ప్రభావాన్ని చూపించాయి.
సోహెల్ చిచ్చుబుడ్డి అతనిని ఎవరు దేఖరు, వేస్ట్ గాడు అని హారిక అన్న మాటలకు సోహెల్ హర్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తగ్గింది. అయితే సోహెల్ కొంచెం హద్దుమీరి మాట్లాడినట్లు అనిపించింది. గింతింత లేవు ఏం మాట్లాడుతున్నావు అని హారిక ను ఘోరంగా అవమానించిన నట్లు తెలుస్తోంది. జోక్ ని నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు అని హారిక ప్రశ్నించింది. కానీ ఈసారి మాత్రం సోహెల్ నోటి మాటలు జారాడు. నిజంగానే ఆ ఎపిసోడ్ లో హారిక జోక్ చేసింది కానీ సోహెల్ మనసుకి తీసుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?