బిగ్ బాస్ ఫోర్ నాలుగవ సీజన్ లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఖచ్చితంగా ఫైనలిస్టు అనుకున్న కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యి ఇంటికి తిరుగుముఖం పట్టారు. అలాగే మొదట్లో తేలిపోయిన వారంతా క్రమంగా పుంజుకున్నారు.
దీనికి తోడు బిగ్బాస్ నిర్వహించే ఉత్కంఠభరిత ఉర్రూతలూగించే గేమ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక షో చివరి వారాలకు చేరుకున్న తరుణంలో నిర్వాహకులు మరో కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చారు. ఈ సీజన్లో రెండవసారి కంటెస్టెంట్ సీక్రెట్ రూమ్ కి పంపనున్నారు.
ఆరంభంలో సోహెల్ హర్యానా సీక్రెట్ రూమ్ లో ఉన్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు అదే క్రమంలో మరొక కంటెస్టెంట్ అఖిల్ ను సీక్రెట్ రూమ్ కి పంపినట్లు సమాచారం. అఖిల్కు ఇంట్లో చాలా మంది తో వైరం ఉంది. పైగా మోనాల్ కి కూడా కటీఫ్ చెప్పేసాడు. దీంతో అఖిల్ లాంటి వ్యక్తి సీక్రెట్ రూమ్ లో ఉండి అందరి గేమ్ ప్లాన్ గమనించడం అనేది చాలా ఆసక్తికర విషయం.
ఇక ఈ దెబ్బకు మిగతా వారిలో ఒత్తిడి పెరుగుతుంది. పైగా అఖిల్ ఫైనల్ లిస్ట్ జాబితా లో ఉంటాడు అన్నది అందరి అంచనాలు. ఎక్కువగా నామినేషన్ కూడా ఫేస్ చేసింది లేదు. అయితే ఈ సీక్రెట్ రూమ్ లో ఉండి అఖిల్ తన స్ట్రాటజీ రచించుకుంటాడా లేదా మిగిలిన వారి పన్నాగాలకు బలి అవుతాడా అన్నది వేచిచూడాలి.