బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి దశకు చేరుకున్న తరుణంలో కంటెస్టెంట్స్ పైన మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే దానిని తట్టుకొని నిలబడతరో వారే చివరి వరకూ నిలుస్తారు. ఈ సమయంలో ఎవరు ఫేవరెట్ కాదు ఎవరు బలహీనమైన కంటెస్టెంట్ కాదు కాబట్టి అంత పెద్ద ఇంటిలో తక్కువ మంది జనం తో క్లిష్టమైన టాస్క లు చేసేటప్పుడు మానసికంగా చాలా బలంగా ఉండాలి.
అయితే నిన్న సోహెల్ తన కంట్రోల్ తప్పినట్లు తెలుస్తోంది. తాను రాజుగా ఉన్నప్పుడు కామెడీ చేసిన సోహెల్ తర్వాత హారిక రాణి అయినప్పుడు ఆమె చెప్పిన పనిచేసేందుకు కోప్పడ్డాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పింది చేసి లోపలికి వెళ్లి కుర్చీ విసిరేశాడు. అభిజిత్ తో అఖిల్ గురించి కంప్లైంట్ చేసాడు. నాకు మంత్రిగా ఉన్నప్పుడు నేను చెప్పిన పని చేయలేదు కానీ హారిక రాణి గా ఉన్నప్పుడు మాత్రం నన్ను ఇరికించాడు అని చాడీలు చెప్పాడు.
అఖిల్ మాత్రం తాను ఆమె చెప్పిన పనులు మాత్రమే చేశానని తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. ఇక ఈ దెబ్బతో అఖిల్-సోహెల్ ఒక్కసారిగా ప్రేక్షకుల దగ్గర కొద్దిగా నెగటివ్ అయిపోయారు. అభిజిత్ ప్రశాంతంగా ఉంటే అరియానా మాత్రం హాయిగా సందడి చేసింది. ఓటింగ్ విషయంలో సోహెల్ కు పెద్దగా ప్రమాదం రాకపోవచ్చు కానీ టైటిల్ దగ్గర మాత్రం అతనికి పడే ఓట్లు తగ్గిపోతాయి. చాలా మంది ఓటర్లు న్యూట్రల్ గా ఉంటారు. ఇలా చీటికీ మాటికీ కోపం ప్రదర్శిస్తే మాత్రం సోహెల్ టైటిల్ రేసులో నుండి తప్పుకోవాల్సిందే.