మొత్తానికి 105 రోజుల బిగ్ బాస్ నాలుగవ సీజన్ విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్ మధ్యలో కొంత నిరాశ పరిచినప్పటికీ మొత్తంగా క్రేజ్ మాత్రం బాగానే అందుకుంది. ఇక ఎటువంటి రియాలిటీ షో’లు వరుసబెట్టి ఏడాదికి ఒక సీజన్ చేస్తాయి కాబట్టి కనీస అంచనాలను అందుకోవటం అనేది చాలా కీలకం. అవి తగ్గితే మాత్రం తర్వాత సీజన్కు ప్రేక్షకులు ఉండరు. అప్పుడు ప్రయత్నం మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి క్రేజ్ నిలబెట్టుకోవడం ముఖ్యం.
బిగ్ బాస్ షో సరిగ్గా ఆదరణ పొందుతోందా లేదా అంటే టి ఆర్ పి తో పాటు మరొక అంశం కూడా ఎంతో కీలకం. అదే ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెస్టెంట్ లకు వేసే ఓట్లు. ఇక ఈ సీజన్ విజేతగా అందరూ అనుకున్నట్లే అభిజిత్ గెలిచాడు. అయితే కంటేస్తెంట్లకు సంబంధించిన ఓట్ల విషయంలో కూడా బిగ్బాస్ ఈ సారి కొత్త రికార్డులు క్రియేట్ చేసినట్లు తెలిసింది.
గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్ కు వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్య రెట్టింపు అని చెప్పాలి. కంటెస్టెంట్స్ లో చాలా వరకు ఒక ప్రత్యేకమైన అభిమానం సంపాదించుకోవడం తో ఓట్లు పడ్డాయి గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ మొత్తం 15 కోట్ల 55 లక్షల ఓట్లు పోల్ అయినట్లు అక్కినేని నాగార్జున తెలిపాడు. 2019లో మొత్తం ఎనిమిది కోట్ల ఓట్లు మాత్రమే పడ్డాయి. 2020లో అందుకు రెట్టింపు ఓట్లు రావడంతో ఈ షో కి క్రేజ్ ఎంత పెరిగిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!