Bihar Police: పోలీసులు ఎక్కడైనా పోలీసులే!వారి రూటే సపరేట్ గా వుంటుంది.ఒంటిపై ఉన్న యూనిఫాం వారికి ఎక్కడలేని అధికారాలను కట్టబెడుతుంది.తాము ఏమి చేస్తున్నారో కూడా తెలియనంత,తమను ఎవ్వరూ ఏమీ చేయలేరన్నంత పోలీస్ పవర్ వారి నరనరాన పొంగుతుంటుంది.అలాగ అధికార దర్పాన్ని తలకెక్కించుకుని ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఒక మహిళ చేత మసాజ్ చేయించుకుని బీహార్లో ఒక పోలీసు అధికారి నాలుగో సింహాన్ని నవ్వుల పాలు చేశాడు.ఆ నిర్వాకం బయటపడటంతో సదరు పోలీసు అధికారి సస్పెండ్ అయ్యాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అసలేం జరిగిందంటే!
బీహార్లోని సహర్సా జిల్లా నౌహట్ట పోలీసులు తమ స్టేషన్ పరిధిలో ఒక తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు.నిందితులను అరెస్టు చేశారు.ఈ క్రమంలో నిందితుల్లో ఒకరి తల్లి తన బిడ్డను బెయిల్ పై విడిపించే మార్గం తెలుసుకోవడం కోసం మరో మహిళ సాయంతో సదరు పోలీస్ స్టేషన్కి వెళ్లింది.పోలీస్ స్టేషన్లో ఆ సమయంలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ శశిభూషన్ సిన్హా ను కలిసింది.తన మొర వినిపించింది.సహాయం చేయమని ప్రార్థించింది.
Bihar Police: అప్పుడా ఎస్ఐ ఏం చేశాడంటే!
దీనికి స్పందించిన ఎస్సై సభ్యసమాజం సిగ్గుపడేలా ఆ బాధితురాలి చేత మసాజ్ చేయించుకున్నాడు.ఒకవైపు మసాజ్ చేయించుకుంటూనే మరోవైపు తనకు తెలిసిన లాయర్ తో ఫోన్లో మాట్లాడాడు.ఆమె కుమారుడికి బెయిల్ ఇప్పించే ఏర్పాట్లు చేయమని,తానే పదివేల రూపాయలు పంపిస్తానని శశిభూషన్ సిన్హా ఆ లాయర్ కు చెప్పాడు.తాను ఇద్దరు మహిళలను ఒక కవరిచ్చి పంపిస్తానని,ఒరు ఆధార్ కార్డులు తెస్తారని,తదుపరి బెయిల్ కు ఏర్పాట్లు చేయమని ఎస్సై ఆ న్యాయవాదికి పురమాయించాడు.
వీడియో ద్వారా వెలుగు చూసిన దారుణం
కాగా ఈ దృశ్యాన్నంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసు శాఖలో ప్రకంపనలు రేగాయి.బాధితురాల తో వచ్చిన మరో మహిళే ఈ వీడియో తీసింది అన్న అనుమానాలు లేకపోలేదు.అయితే పోలీసుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో జిల్లా ఎస్పీ లిపి సింగ్ వేగంగా స్పందించి ప్రాథమిక విచారణ జరిపించి ఎస్సై శశిభూషణ్ ను సస్పెండ్ చేశారు.ఏదేమైనా పోలీస్ శాఖ పంటల మరో మరక బీహార్ సంఘటన అని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు!