అసలే కరోనా corona వైరస్, కొత్త కరోనా స్టైయిన్ strain వైరస్ వ్యాప్తితో వణికిపోతున్న ప్రజలకు ఇప్పుడు తాజాగా బర్డ్ ఫ్లూ bird flu భయం తోడయ్యింది. దేశ వ్యాప్తంగా అయిదు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు పెద్ద ఎత్తున వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం central government వెంటనే స్పందించి రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. బర్డ్ ఫ్లూను కేరళ Kerala ఇప్పటికే రాష్ట్ర విపత్తుగా ప్రకటించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ అధికారులకు బర్డ్ ఫ్లూ కేసులు తలనొప్పిగా మారాయి. బర్డ్ ఫ్లూ గా పిలువబడే ఏవియన్ ఇన్ ఫ్లూఎంజా వైరస్తో కోళ్లు, బాతులు, కాకులు వేలాదిగా మృతి చెందుతున్నాయి.
ఇప్పుడు తాజాగా ఏపిలోని కర్నూలు జిల్లాలోనూ పెద్ద ఎత్తున కోళ్లు అనుమానాస్పదంగా మృతి చెందడం ఆందోళన కల్గిస్తుంది. కర్నూలు జిల్లా కొత్తపల్లె, పాములపాడు మండలాలలోని పలు ప్రాంతాల్లో వింత వ్యాధితో కోళ్లు, కాకులు చనిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కోళ్లు చనిపోయిన తరువాత ముక్కలో నుండి ఒక రకమైన ద్రవం కారడం, కొన్ని కోళ్లకు చర్మంపై బొడిపెలుగా వచ్చి చర్మం రాలిపోవడం వంటివి జరుగుతున్నాయని బాదితులు తెలుపుతున్నారు. గురువారం కొత్తపల్లె మండలం సింగరాజుపల్లె గ్రామంలో సంజీవరాయుడుకు చెందిన 50 కోళ్లు మృతి చెందాయి. ఆదే గ్రామంలో అయిదు కాకులు కూడా మృతి చెందాయి. పాములపాడు చెందిన నబీరసూల్ అనే రైతు ఇంట్లో నాలుగు, కృష్ణానగర్ గ్రామంలో రామకోటినాయక్ అనే రైతు ఇంట్లో 70 కోళ్లు చనిపోయాయి. ఇదే పరిస్థితి పలు గ్రామాల్లో రైతుల ఇళ్లలో కొనసాగుతోంది. అయితే ఈ విషయం తమ దృష్టికి రాలేదని పాములపాడు పశువైద్యాధికారి భాస్కర్ తెలిపారు.
బర్డ్ ఫ్లూ వైరస్ పక్షుల నుండి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాల్లో పౌల్ట్రీ యజమానులకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ బర్డ్ ఫ్లూ వైరస్ పక్షుల నుండి మనుషులకు వ్యాప్తి చెందిన దాఖలాలు ఇప్పటి వరకూ లేవు. అయితే ముందు జాగ్రత్త చర్యగా బల్డ్ ప్లూ విస్తరించిన పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు మాంసం విక్రయాలపై నిషేదాజ్ఞలు జారీ చేశాయి. బల్డ్ ఫ్లూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపిలో పశు సంవర్థక శాఖ వైద్యాధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉంది.