- మైభీ చౌకీదార్ పేర మోదీ ప్రచారం
- దానిపై కాంగ్రెస్ పార్టీ సెటైర్ల ట్వీట్లు
- తిప్పికొట్టిన బీజేపీ.. మళ్లీ కాంగ్రెస్
- ట్విట్టర్ వేదికగా పార్టీల యుద్ధం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ‘మైభీ చౌకీదార్’ (నేనూ కాపలాదారుడినే) ప్రచారం కొత్త యుద్ధానికి దారితీసింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య ట్విట్టర్ వేదికగా భారీ కొట్లాట మొదలైంది. సార్వత్రిక ఎన్నికల తొలిదశకు మూడు వారాలే సమయం ఉండటంతో ప్రచారం వేడెక్కింది. వివేచనలేని, ఆటోమేటెడ్ సందేశాలతో సోషల్ మీడియాను నింపేస్తున్నారంటూ బీజేపీపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. దానికి బీజేపీ కూడా దీటుగా స్పందిస్తూ నిజాయితీ లేని, మోసకారి కపట పార్టీ అంటూ ప్రతిపక్షాన్ని తిట్టిపోసింది.
It’s great to see that Modi is still in touch with his buddies. #ChowkidarChorHai pic.twitter.com/191BinitIb
— Congress (@INCIndia) March 16, 2019
సోషల్ మీడియాలో ప్రధాని మోదీని ఎగతాళి చేయడానికే ఉన్న కొన్ని ఖాతాలకు కూడా బీజేపీ ప్రచార ట్వీట్లు వెళ్లాయి. వాటిలో ఒకటి అంబానీకా చేలా (అంబానీతొత్తు) అనే అకౌంటుకు వెళ్లిందని కాంగ్రెస్ చెబుతోంది. మరొకటి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పేరిట ఉన్న ఫేక్ అకౌంటు. దాన్నుంచి బీజేపీకి సమాధానం కూడా వచ్చిందని, ‘‘సర్, నా అప్పులన్నీ మాఫీ చేయించండి’ అని అందులో ఉందని కాంగ్రెస్ చెప్పింది. మోదీ ఇప్పటికీ తన స్నేహితులతో టచ్ లోనే ఉన్నట్లు చూసి చాలా సంతోషిస్తున్నామని ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ నుంచి ట్వీట్ చేశారు.
Dear @INCIndia,
Dishonesty, deceit, photoshopped images and fake news is your identity.
For decades, your leaders have used those techniques to loot, plunder and ruin India.
It is against this Congress culture that India stands vigilant and says- #MainBhiChowkidar. https://t.co/fOAqoP0V0W
— BJP (@BJP4India) March 16, 2019
దానికి వెంటనే బీజేపీ కూడా సమాధానం ఇచ్చింది. కాంగ్రెస్ ట్వీట్ లో ఉన్న ఫొటోలన్నింటినీ మార్చేశారని ఆరోపించింది. ‘డియర్ కాంగ్రెస్.. నిజాయితీరాహిత్యం, కుతంత్రాలు, ఫొటోషాప్ చేసిన ఫొటోలు, ఫేక్ వార్తలే మీ గుర్తింపు. కొన్ని దశాబ్దాలుగా మీ నాయకులు ఇలాంటి కుయుక్తులతో దేశాన్ని దోచుకుని, సర్వనాశనం చేశారు. భారతదేశం అప్రమత్తంగా ఉండి, ‘మైభీ చౌకీదార్’ అనడం కాంగ్రెస్ సంస్కృతికి వ్యతిరేకం’ అని తన ట్వీట్ లో పేర్కొంది.
Dear BJP,
We’re sorry your campaign backfired. We sympathise with your pain & frustration. Maybe you should make an effort to be real than rely on bots 🙂
Feel hugged ?
Love,
From the party that fought for your freedomP.S #EkHiChowkidarChorHai 😉 https://t.co/2LtfDwIFPW
— Congress (@INCIndia) March 16, 2019
దానికి మళ్లీ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంలో అనిల్ అంబానీకి మోదీ సర్కారు మేలు చేసిందని ఆరోపించింది. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా దేశంలో బ్యాంకులను మోసం చేసి పారిపోవడానికి సాయం చేసిందని చెప్పింది. ‘‘మోదీకి ముఖ్యమైన సందేశం: భారతదేశం మూర్ఖమైంది కాదు. సూట్లు, బూట్లకు మేలుచేసే ఏకైక కాపలాదారుడు మీరేనని అందరికీ తెలుసు’’ అని పార్టీ ట్వీట్ చేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?