ఆంధ్ర కుల రాజకీయాల కంటే బీహార్ కుల సమీకరణ రాజకీయాలు అధికం. ఇక్కడ వీధికో కుల సంఘము దర్శనం ఇస్తుంది. రాజకీయాల్లో కుల నాయకులే అధిక పాత్ర పోషిస్తారు. అందుకే బీహార్ ప్రజల ఆలోచన కంటే ముందు కుల కట్టుబాట్లు ఉంటాయంటారు. దీనికి తగ్గట్టు గానే అక్కడి నాయకుల రాజకీయాలు కనిపిస్తాయి. జాతీయ రాజకీయాల కంటే బీహార్ రాజకీయాలు చేయడం చాల కష్టమని కొందరు ఢిల్లీ స్థాయి నాయకులూ జోకులు వేయడం పరిపాటి. చాల రోజులు తర్వాత బీహార్ కొలనులో కమల కాంతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెడియు తో దోస్తీ కట్టి ఎన్డీయే కుటుమిగా ప్రజల్లోకి వెళ్లిన బీజేపీకు వస్తున్నా ఫలితాలు జోష్ నింపుతున్నాయి. ఆధిక్యతలో బీజేపీ ముందుంది.
బీసీల మత్రం
బీజేపీ మొదటి నుంచి బీహార్లో బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఆర్జెడిను సొంత పార్టీగా భావించే యాదవ సామజిక వర్గం వారికీ బీజేపీలో ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు సాగింది. తనకు ఇవే చివరి ఎన్నికలు అని నితీష్ చెప్పడం, దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఒక రకమైన సంఘీభావం వచ్చేలా ప్రణాళికలు రచించి ముందుకు సాగారు. బీహార్ జనాభాలో ఓబీసీ, ఈబీసీలు 51శాతం. వీరిలో యాదవ వర్గం 14 మెజారిటీ శాతం. వీరి ఓట్లలో అధికభాగం ఆర్జెడి కు అనుకూలమే. అందుకే వీరి వర్గం నుంచే బీజేపీ నాయకుల్ని ప్రోత్త్సహించింది. ఇది ఈ ఎన్నికల్లో కలిసొచ్చింది. 2015 ఎన్నికల్లో 157 చోట్ల పోటీ చేసి 53 సీట్లు సాధించిన బీజేపీ దాన్ని 80 వరకు పెంచుకునే అవకాశం తెచ్చుకుంది. మిత్రపక్షం జెడియు 122 పోటీ చేసి 52 చోట్ల ఆధిక్యంలో ఉంటె బీజేపీ 121 పోటీ చేసి 80 సాధించేలా ఆధిక్యం కనబర్చడం చూస్తుంటే బీహార్లో బీజేపీ బలం పెరిగిందనే చెప్పాలి.
నమ్మలేదు … పడలేదు
బీహార్లో ఆర్జేడీ హావ ఎక్కువ. ఎటు లాలూ ప్రసాద్ యాదవ్ లేకున్నా అతడి కుమారుడు తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికలు ఎదుర్కొన్నారు. లాలూ పేరు ఎత్తకుండా ప్రచారం చేసారు. రాష్ట్రముఅంత తేజస్వి కలియ తిరిగారు. నాన్న సింపతి తోడు, యువ నాయకత్వం అవకాశం ఇవ్వాలని కోరారు. మరో పక్క కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సైతం కల ముందు హత్రాస్ ఘటనలో దళిత యువతీ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు చేసిన హడావుడి బీహార్ ఫలితాల్లో ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. ఐతే దీన్ని బీహార్ ప్రజలు నమ్మినట్లు ఫలితాల సరళిని బట్టి అర్ధం అవుతుంది. గత ఎన్నికల్లో 80 సీట్లు సాధించిన ఆర్జెడి 67 వరకు మాత్రమే వచ్చింది. కాంగ్రెస్ సైతం గత ఎన్నికల్లో వచ్చిన 27 సీట్లను పదిల పర్చుకునేలా కనిపిస్తోంది. వామపక్షాలు కాస్త ముందంజలో ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే నెంబర్ మార్కుకు చేరువ కావడం కష్టమే అని చెప్పాలి. అయితే బీహార్లో ప్రస్తుతం వచ్చిన ట్రెండ్ అంత అలాగే ఉంటుంది అని చెప్పలేం. కేవలం ఆధిక్యతలు మారుతున్నాయి. ఫలితాల అనంతరం దీనిపై స్పష్టత వస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?