Eatela Rajendar: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకా అయిన హుజురాబాద్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక ఇటు ఈటల రాజేందర్ కు అటు టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ ఎన్నిక విషయంలో పక్కాగా వ్యవహరిస్తోంది. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రఘునందర్ రావు హుజురాబాద్ ఎన్నికల్లో అధికార TRS పార్టీ కుట్రలు, కుతంత్రాలకు తెర లేపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
హుజురాబాద్ లో బీజేపీ,టీఆర్ఎస్ కు మాత్రమే పోటీ అని రఘునందన్ రావు అన్నారు. 14 ఏళ్ల ఉద్యమ పార్టీ, ఏడేళ్ల అధికార పార్టీ.. ఒక్క బీసీ నాయకుడిని తయారు చేసుకోలేకపోయిందని రఘునందన్ రావు విమర్శించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని నోట్ల కట్టలు వెదజల్లినా ఎవరికి పట్టం కట్టాలో ప్రజలు ఒక్క సారి ఆలోచించుకోవాలన్నారు. గతంలో దుబ్బాకలో ఎంత నిష్టగా బీజేపీ పని చేసిందో.. అదే నియమనిష్టలతో హుజురాబాద్ లో కూడా పని చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వందమంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపును ఆపలేరని ఎమ్మెల్యే రఘునందన్ రావు తేల్చి చెప్పారు. పాలపొంగు, నీటి బుడగల్లా ఫ్లెక్సీలు పెట్టుకుని వెళ్ళగానే గెలుపు కాదన్నారు.
వాళ్లపై స్పెషల్ ఫోకస్….
హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, నర్సింగపూర్, రెడ్డిపల్లి, చల్లూర్, బిజిగిరి షరీఫ్, కమలాపూర్, వావిలాల, మామిడాలపల్లి, హిమ్మత్నగర్, ఇల్లంతకుంట, రామన్నపల్లి తదితర ప్రాంతాలకు చెందినవారి కుటుంబసభ్యులు సింగరేణిలో ఉద్యోగులుగా ఉన్నారు. వీరికి సొంతూర్లలో భూములు, వ్యవసాయం, స్థిర నివాసాలున్నాయి. ఉద్యోగుల కుటుంబాలు సింగరేణి ప్రాంతాలైన మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, కాసిపేట, గోదావరిఖని, సెంటినరీ కాలనీ, యైటింక్లైయిన్ కాలనీ, రామగుండం తదితర ప్రాంతాల్లో ఉంటున్నాయి. హుజూరాబాద్ ఓటర్లకు, సింగరేణి కార్మిక కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వాలను గుర్తించే పనిలో కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు పడ్డారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?