2019 సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీతో ఊహించని విధంగా కేంద్రంలో అధికారాన్ని సంపాదించింది బిజెపి. 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే అత్యధిక మెజార్టీతో మోడీ ప్రధాని అయ్యారు. ఎవరి సపోర్టు లేకుండానే బిజెపి కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించడంతో భారతదేశంలో బిజెపికి తిరుగులేదని అందరూ డిసైడ్ అయిపోయారు.
ఏ రీతిలో రెండోసారి ప్రధాని అయ్యాక మోడీ కూడా నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. కానీ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి దారుణంగా ఓటమి చెందడంతో…దేశంలో కమలం పార్టీ కి రోజులు దగ్గర పడ్డాయని వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో బీహార్ రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక లో జరిగిన ఎన్నికలలో బిజెపి పార్టీ గెలవటం తో దేశంలో బీజేపీ పార్టీ గ్రాఫ్ పెరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు విశ్లేషకులు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అది టిఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీ గా ఉండే నియోజకవర్గంలో బిజెపి గెలవటం తో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మొత్తం మారిపోయినట్లే అని అంటున్నారు పరిశీలకులు. సాధారణంగా తెలంగాణ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ తర్వాత రెండో స్థానంలో ఉండే కాంగ్రెస్ పార్టీని వెనక్కు నెట్టి బిజెపి చాలా వరకు దూకుడుగా రాణించడంతో… తెలంగాణలో రాబోయే రోజుల్లో కమలం వికసించే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా అటు బీహార్ ఎన్నికలలో బిజెపి సత్తా చాటడం ఇటు దుబ్బాక ఎన్నికలలో కూడా గెలవడంతో… బీజేపీ శిబిరాలలో నూతనోత్సాహం నెలకొంది. దీంతో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కి రోజులు దగ్గర పడినట్లే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.