తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఊహించని విధంగా భారీ ఓట్ బ్యాంక్ సాధించటమే కాక స్థానాలు కూడా కైవసం చేసుకుంది. కొద్దిపాటి లో మేయర్ పీఠాన్ని మిస్ చేసుకుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తెలంగాణ బిజెపి నేతలు భారీస్థాయిలో కష్టపడి పార్టీ కి మంచి మైలేజ్ తీసుకురావడంతో.. గ్రేటర్ లో సత్తా చాటిన బిజెపి గెలుపు కొరకు బీజేపీ హైకమాండ్ సరికొత్త గిప్ట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
పూర్తి మేటర్ లోకి వెళ్తే రెండు తెలుగు రాష్ట్రాలలో కేంద్ర మంత్రివర్గంలో ఉన్నది ఒకరు. అదికూడా సహాయమంత్రి హోదాలో. గత సారి చూస్తే కేంద్ర మంత్రివర్గంలో బిజెపితో జత కట్టిన టిడిపి పార్టీ నేతలకు మంత్రి పదవులు మోడీ సర్కార్ కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కమలం పార్టీకి మిత్రపక్షాలు లేవు.
జనసేన ఉన్నాగాని ఆ పార్టీకి ఎంపీలు లేరు. పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ బీజేపీకి దక్షిణ ప్రాంతం చాలా కీలకంగా మారింది. ఉత్తరంలో చాలా బలంగా ఉంది బిజెపి. అయితే దక్షిణాదిలో కూడా బలపడాలని ఎప్పటి నుండో అనేక వ్యూహాలు వేస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో తెలంగాణలో ఉన్న కొద్దీ బీజేపీ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో.. తెలంగాణ బిజెపి నేతలను ప్రోత్సహించడానికి మోడీ సర్కార్ రెడీ అయినట్లు టాక్. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం కూడా వచ్చే అవకాశాలు ప్రస్తుత పరిణామాలను బట్టి ఉండటంతో.. బీజేపీ పెద్దలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిజెపి పార్టీ నాయకులలో ఒకరిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవటానికి ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.