త్వరలో తిరుపతి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో ప్రధాన పార్టీలు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలలో గెలిచి వైసీపీ ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకత ఉంది అని రుజువు చేయడానికి ప్రతిపక్షాలు అనేక వ్యూహాలు వేస్తున్నాయి. మరోపక్క వైసిపి పార్టీ జరగబోయే ఉప ఎన్నికలలో 2019 లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజార్టీ సాధించి.. ప్రజలలో వైసీపీ ప్రభుత్వానికి తిరుగులేదు అని రుజువు చేసుకోవాలని మంచి జోరు మీద ఉంది.
ఇలాంటి తరుణంలో ఏపీ బీజేపీ సినీ గ్లామర్ ని నమ్ముకుని తిరుపతి ఉప ఎన్నికల్లో బరిలోకి దిగడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ ని రంగంలోకి దించి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎక్కడైతే ప్రచారం చేస్తుందో అక్కడ ఆమెను దింపడానికి కమలనాథులు స్కెచ్ వేస్తున్నట్లు టాక్ వస్తుంది.
ఇప్పటికే వాణి విశ్వనాథ్ తో ఏపీ బీజేపీ నేతలు టచ్లో ఉన్నట్లు త్వరలోనే ఆమె బిజెపిలో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. వాస్తవానికి వాణి విశ్వనాథ్ 2019 ఎన్నికల్లో టిడిపి పార్టీ తరఫున ఎమ్మెల్యే రోజా కి పోటీ గా నగరి నియోజకవర్గం తరుపున నిలబడాలని ప్రయత్నాలు జరపగా, చంద్రబాబు నగరి టికెట్ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబానికి కేటాయించడంతో వాణి విశ్వనాథ్ టిడిపిలో జాయిన్ అవ్వకుండా సైలెంట్ అయిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా బిజెపి నుండి ఆఫర్ రావడంతో రోజా కి ధీటుగా రాజకీయాలు చేయడానికి వాణి విశ్వనాధ్ కూడా ఉత్సాహంగా ఉన్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ వస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?