మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా బిజెపి 17 స్థానాల్లో గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు లో విజయం సాధిస్తుందని తెలిపాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంతోపాటు ఉప ఎన్నికలు జరిగిన ఉత్తర ప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాలలోనూ … కాషాయ దళం నాయకులే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
మధ్యప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ 16 నుంచి 18 స్థానాలలో విజయం సాధిస్తుందని ఇండియా టుడే సర్వే వెల్లడించింది. తద్వారా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకుంటోంది అంటూ ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ లో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల అనంతరం స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ సీనియర్ నేత కమల్నాథ్ ముఖ్యమంత్రిగా కొలువుదీరారు.
సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా మరికొంత మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరడం తో అక్కడ సంక్షోభం ఏర్పడింది. అనంతరం జరిగిన విశ్వాస పరీక్షలో కమల్ నాథ్ సర్కార్ ఓడిపోయింది. దీంతో అధికారం బిజెపికి వచ్చినట్లయింది. ఆ తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు రావడం జరిగింది. ఈ ఏడాది మార్చి తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీకి 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ ఎమ్మెల్యేల సంఖ్య 230. అధికారం చేపట్టడానికి కావలసిన బలం 116 సీట్లు. ఉన్న ఈక్వేషన్స్ బట్టి చూస్తే ప్రస్తుతం బీజేపీకి 107 అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 87 స్థానాలు ఉన్నాయి. అయితే మరో ఎమ్మెల్యే రాజీనామా చేయడం జరిగింది. దీంతో 229 కి తగ్గింది, ఈ పరిణామంతో మ్యాజిక్ ఫిగర్ 115 కి మారింది. ఉప ఎన్నికలలో బిజెపి కి 8 సీట్లు వస్తే చాలు ఆ పార్టీ అంది వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడాము గ్యారెంటీ. దీంతో ఇప్పుడు బిజెపి శ్రేణులకు 8 సంఖ్య తెగ టెన్షన్ పెడుతున్నట్లు సమాచారం.