బిజెపి సీనియర్ నేత, మాజీ ఎమ్ఎల్ఏ బద్దం బాల్రెడ్డి కన్నుమూశారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
బద్దం బాల్ రెడ్డి కొంత కాలంగా చిన్న పేగు సంబంధిత కేన్సర్తో బాధ పడుతున్నారు. క్రమంగా కాలేయానికి కూడా కేన్సర్ సోకింది. ఈక్రమంలో ఈ నెల 10న కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. 13న చిన్న పేగుకి కేర్ ఆస్పత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై ఉంచి వైద్యం అందించారు. ఇవాళ ఆరోగ్యం మరింత విషమించడంతో కన్నుమూశారు.
1985, 1989, 1994లలో కార్వాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు బద్దం బాల్రెడ్డి ఎమ్ఎల్ఏగా గెలుపొందారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పాతబస్తీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బద్దం బాల్రెడ్డిని అభిమానులు గోల్కొండ టైగర్గా పిలుచుకొనేవారు. అప్పట్లో ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఓవైసీకి పాతబస్తీలో ఆయన గట్టి పోటీ ఇచ్చారు.
బద్దం బాల్రెడ్డి మృతితో కమలదళంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బద్దం బాల్రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రేపు సాయంత్రం 5గంటలకు మహాప్రస్థానంలో బాల్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.