ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ కీలక నేత దారుణ హత్యకు గురయ్యారు. ఫిరోజాబాద్ బీజెపీ ఉపాధ్యక్షుడు డికె గుప్తాను దుండగులు కాల్చి చంపారు. నిన్న రాత్రి బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. శుక్రవారం రాత్రి గుప్తా తన కిరాణా షాపును మూసివేస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. రక్తపు మడుగులో పడిపోయిన ఆయనను కుటుంట సభ్యులు ఆగ్రాలోని ఒక ప్రైవైటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుప్తా మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.
ఫిరోజాబాద్ ఎస్ పి సచింద్ర పటేల్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుప్తా కుటుంబ సభ్యులు పలువురిపై అనుమానం వ్యక్తం చేయడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని ఎస్ పి తెలిపారు. కాగా ఉత్తరప్రదేశ్ లో గత ఏడాది ఇదే నెలలో ముగ్గురు బీజెపి నేతలు హత్యకు గురయ్యారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?