తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ఆధ్వర్యంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి గెలవడం సంచలనంగా మారింది. దుబ్బాక ఉప ఎన్నికలలో పార్టీ తరఫున బండి సంజయ్ చేసిన కృషి అభినందనీయమని బీజేపీ హైకమాండ్ నాయకులు ప్రశంసల వర్షం కురిపించారు. సరిగ్గా ఉప ఎన్నికల సమయంలో బండి సంజయ్ పార్టీ క్యాడర్ ని ఒకటిగా చేసి ఓటర్ల దృష్టి ఆకర్షించడంలో బ్యాలెట్ లో ఓటు పడటం లో చాలా తెలివిగా వ్యవహరించారని పార్టీ నేతలే చెపుతున్నారు.
ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా గెలవడానికి బిజెపి ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటూ పోతోంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో టిడిపితో దోస్తీ కట్టడానికి బండి సంజయ్ చంద్రబాబు తలుపు తట్టడానికి రెడీ అయినట్లు టాక్.
పూర్తి విషయంలోకి వెళితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొన్నిచోట్ల టిడిపి గెలిచే అవకాశం ఉన్నట్లు బీజేపీ గుర్తించడంతో పాటు బిజెపి కి పోటీ ఇచ్చే రీతిలో టిడిపి క్యాడర్ ఉన్నట్లు గుర్తించడంతో ఆ చోట టిడిపి అభ్యర్థులు నిలబెట్టకుండా ఉండేవిధంగా బాబుతో మంతనాలు జరపడానికి బండి సంజయ్ రెడీ అయినట్లు రాజకీయవర్గాలలో వార్తలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు నియోజకవర్గాల్లో బాగా ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ఆ చోట టీడీపీ కూడా పట్టు ఉండటంతో… సంబంధిత నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్థులు నిలబెట్టకుండా కమలం పార్టీ పెద్దలు చంద్రబాబుతో మంతనాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఇదే వార్త వాస్తవమైతే బీజేపీతో దోస్తీ కట్టాలనుకున్న చంద్రబాబుకి ఇది పెద్ద అవకాశమని విశ్లేషకులు అంటున్నారు.