(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్కు తానా మహసభల్లో చేదు అనుభవం ఎదురయ్యింది. వాషింగ్టన్ డీసిలో ఏర్పాటు చేసిన తానా సభలకు తెలుగు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు అతిధులుగా హజరయ్యారు. రాంమాధవ్ కూడా గౌరవ అతిధిగా హజరయ్యారు.
సభలో రాంమాధవ్ ప్రధాని మోదిని ప్రశంసిస్తూ మాట్లాడుతుండగా కొందరు ప్రవాంసాధ్రులు ఈలలు, కేకలతో గందరగోళాన్ని సృష్టించారు. వేదిక నుండి దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. ఈ హఠాత్పరిణామానికి రాంమాధవ్ ఖంగుతిన్నారు. ఈ సమయంలో తానా అధ్యక్షుడు సతీష్ వేమున కలుగుజేసుకొని బిజెపిలో కీలకనేత ప్రసంగిస్తున్న సమయంలో ఇలా వ్యవహరించడం సభ్యత కాదంటూ హెచ్చరించారు. ప్రసంగాన్ని కొనసాగించాలనీ ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ అప్పటికే రాంమాధవ్ తన ప్రసంగాన్ని ముగించడంతో నిర్వహకులు ఆయనను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?