ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ తో భేటీ అవ్వడం తెలిసిందే. అయితే ఈ భేటీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయం గురించి కెసిఆర్ ప్రధాని మోడీ తో చర్చలు జరిపినట్లు వార్తలు రావడం జరిగాయి. ఇదిలావుంటే ఇటీవల బిజెపిలో చేరిన విజయశాంతి తాజాగా కేసీఆర్… మోడీ బేటీ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయశాంతి ఈ బేటీ గురించి ప్రస్తావిస్తూ పైకి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానితో భేటీ అయినట్లు కేసీఆర్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని ఆరోపించారు. ప్రజల కోసం నీళ్లు కోసం కాదు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ చేసే అవినీతిపై కేసులు పెట్టకుండా మోడీతో కాళ్ల బేరానికి కెసిఆర్ దిగినట్లు విజయశాంతి ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇదే సందర్భంలో భవిష్యత్తులో పార్లమెంట్ కి పోటీ చేయాలా లేకపోతే అసెంబ్లీకి పోటీ చేయాలో అనేది బీజేపీ హైకమాండ్ తీసుకునే నిర్ణయం బట్టి అడుగులు వేస్తాను అని తాజా ఇంటర్వ్యూలో విజయశాంతి స్పష్టం చేసింది. అంతమాత్రమే కాకుండా రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి తనవంతుగా అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంది అన్నట్టు విజయశాంతి చెప్పుకొచ్చింది.