కెసిఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. వెళ్లిన వెంటనే బిజెపి పెద్దలను ఒకరి తర్వాత ఒకర్ని కలుస్తున్నారు. ఇంత అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది…? పిలుపు ఎవరిది అక్కడ ఎలాంటి చర్చలు చేస్తున్నారు అనేది?? అంతా రహస్యమే అయినా, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మంచి సీట్లు సాధించిన బిజెపి కచ్చితంగా మేయర్ పీఠం సాధించేందుకు కేసీఆర్తో మంతనాలు సాగిస్తున్నట్లు జోరుగా ప్రచారం అందుకుంది.
ఇస్తారా? జట్టు కడతారా??
టిఆర్ఎస్ బిజెపి గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో బాహాబాహీ తలపడ్డాయి. 150 సీట్ల గ్రేటర్ వార్లో రెండూ పార్టీలు పరువు నిలబెట్టుకునే సీట్లే సంపాదించాయి. టిఆర్ఎస్ గత ఎన్నికల్లో 99 సీట్ల నుంచి 56 కు వస్తే, బి.జె.పి.తో 4 నుంచి ఏకంగా 46 కు వచ్చింది. అంటే ఈ ఎన్నికల్లో బీజేపీ భారీగా పుంజుకున్న ట్లే. గ్రేటర్ ఎన్నికలకు ఎన్నడూ లేనంతగా బిజెపి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కచ్చితంగా తెలంగాణలో బిజెపి మూలాలను బలపరచాలని కోణంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా తో పాటు, అమిత సైతం ప్రచారంలో పాల్గొన్నారు. మరోపక్క ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం పదవి కూడా గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఉత్తరాది నేతలంతా హైదరాబాదులోని ప్రతి గల్లీకి తిరిగి బీజేపీ విజయానికి కృషి చేశారు. ఎంతటి కృషి ఉన్న సమయంలో బిజెపి మేయర్ పీఠానికి దూరంగానే ఆగిపోయింది. కేవలం 46 సీట్ల వద్దని ఆ పార్టీ ఆగిపోయింది. ఈ సంఖ్య గతంతో పోలిస్తే ఎక్కువే అయినా ఇంత మంది జాతీయ నాయకులు వచ్చి, కచ్చితంగా హైదరాబాదులో మేయర్ పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో అది చేరడం బీజేపీకి ప్రతిష్ఠతో కూడినదే. దీంతో ఇప్పుడు టిఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీజేపీ పెద్దలు చర్చలు జరిపేందుకు ఆయనను ఢిల్లీకి రమ్మన్నట్లు విశ్వసనీయ సమాచారం. బిజెపి ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మేయర్ పీఠం తమ ఖాతాలో ఈ సారి ఎలాగైనా వేసుకోవాలనే తలంపుతో బీజేపీ పెద్దలు కేసీఆర్ తో పావులు కదుపుతున్నారు. బిజెపి టిఆర్ఎస్ కలిసి హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పీఠాన్ని పంచుకోవాలని, దానిలో భాగంగా మొదట బీజేపీ కు మేయర్ స్థానం ఇచ్చేలా కేసీఆర్ తో ఒప్పందం చేసుకునేందుకు ఢిల్లీ పెద్దలు ఆయనను చర్చలకు ఆహ్వానించారు.
వదులుకుంటారా??
బిజెపి దక్షిణాదిన బలపడాలంటే హైదరాబాద్ మేయర్ పీఠం ఖాతాలో కచ్చితంగా ఉండాలి. ఇది ఉత్తరాది వారికి ఒక ఇండికేషన్ గా మారుతుంది. ఇది బిజెపి వ్యూహం. దీనికోసమే తెలంగాణలో రాజకీయ శత్రువుగా ఉన్న కెసిఆర్ తో సహితం మేయర్ పీఠం గురించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువ స్థానాలు వచ్చిన టిఆర్ఎస్ అధ్యక్షుడిగా కెసిఆర్ ఈ ప్రతిపాదనను ఒప్పుకుంటారా ఒకవేళ ఒప్పుకుంటే బీజేపీ కు అది ఎంతమేర ప్లస్ అవుతుందా అనేది వేచి చూడాలి. కచ్చితంగా బిజెపి తన వ్యూహంతో హైదరాబాద్ పై పట్టు సాధిస్తుంది. ఇది తెలంగాణ అంతటా వచ్చే 2023 ఎన్నికల్లో కనిపిస్తునంది అనడంలో సందేహం లేదు. మరోపక్క ముస్లిం పార్టీగా దేశమంతటా పోటీకి సై అంటున్న మజ్లిస్ పార్టీ ఇలాకాలో బిజెపి మేయర్ పీఠాన్ని అధిరోహిస్తే వారిపై పైచేయి సాధించినట్లు అవుతుందనేది లెక్క. మరి దీన్ని ఈ ఉద్యమ ముఖ్యమంత్రి ఏ మేరకు ముందుకు తీసుకెళ్తారు హైదరాబాద్ పీఠంపై ఏమైనా చిక్కుముడి వీడుతున్న అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.