దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచి తెలంగాణ రాజకీయాల్లో మాత్రమే కాక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది బీజేపీ. అదే ఊపు గ్రేటర్ ఎన్నికల లో కూడా కమలం పార్టీ చూపించింది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు టిఆర్ఎస్ పార్టీకి దరిదాపుల్లోనే కేవలం ఏడు స్థానాలు తక్కువ బీజేపీ గెలవడం సంచలనంగా మారింది.
తెలంగాణ కి గుండెకాయ లాంటి హైదరాబాదులో బిజెపి ఇన్ని స్థానాలు గెలవడం తో ఆ పార్టీలో జోష్ నెలకొంది. హైదరాబాద్ పై పట్టు సాధించాలని లోకల్ ఎలక్షన్ అయినాగాని ఢిల్లీ నుండి అమిత్ షా తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో ప్రచారం చేపించి మాస్టర్ ప్లాన్ వేసిన బిజెపి భారీ స్థాయిలోనే స్థానాలను గెలిచిందని తెలంగాణ రాజకీయ వర్గాలలో టాక్. దీని ఇంపాక్ట్ బాగా ఎన్నికలలో కనబడింది అని చెప్పవచ్చు.
పైగా ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం పార్టీని టార్గెట్ చేసి కొన్ని సంచలన ప్రకటనలు చేయటం వల్ల చాలా వరకు ఓటర్ల ఆలోచన మారినట్లు.. గ్రేటర్ లో బీజేపీ వేసిన వ్యూహాలు చాలా వరకు సక్సెస్ అయినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా గ్రేటర్ ఎన్నికల ఫలితాల ఆధారంగా చూసుకుంటే రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.