పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీలో తొలి నుండి ఉండి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ లో చేరిన సువేందు అధికారి ఆమె పైనే పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ పార్టీ అధినేత మమత బెనర్జీ ఓటమి పాలైయ్యారు. అయితే ఆమె ఓటమి పాలైనప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోవడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు నెలల్లోపు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలిచారు. అయితే పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నేత సువేందు అధికారి ఆదర్శంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి కేసిఆర్ కు వెన్నుదన్నుగా ఉన్న ఈటల రాజేందర్ ను భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రి వర్గం నుండి కేసిఆర్ తొలగించడంతో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తరువాత బీజేపీ లో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల విజయం సాధించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నుండి పోటీ చేయాలని ఈటల ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన శనివారం మీడియాకు చెప్పారు.
కేసిఆర్ పై పోటీ చేయనున్నట్లు ఈటల తెలిపారు. గజ్వేల్ నుండి పోటీ చేస్తానని తాను గతంలోనే చెప్పానని అందు కోసం ఇప్పటి నుండే సీరియస్ గా వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసిఆర్ ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నేత సువేందు అధికారి సీన్ తెలంగాణలోనూ రిపీట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేస్తామని తెలిపారు. త్వరలో పెద్ద ఎత్తున బీజేపీలో చేరికలు ఉంటాయని కూడా వెల్లడించారు ఈటెల.
టీ కాంగ్రెస్ నేతల భేటీలో షర్మిల పార్టీపై చర్చ.. ఎందుకంటే..?