వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. రాాజాసింగ్ ను ఆయన ఇంటి వద్దనే పోలీసులు అరెస్టు చేసి జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన మునావర్ ఫరూఖీ షోను నిరసిస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. యూట్యూబ్ వీడియోలో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఎంఐఎం నేతలు ఆరోపించారు. రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఎంఐఎం నేతలు పిర్యాదులు అందజేశారు. డబీర్ పురా పోలీస్ స్టేషన్ స్టేషన్ లో రాజాసింగ్ పై కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్ లలో కూడా రాజాసింగ్ పై ఫిర్యాదులు అందాయి. రాజాసింగ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ల వద్ద, సీపీ కార్యాలయం వద్ద ఎంఐఎం నేతలు ఆందోళన చేశారు.
ఎంఐఎం నేతల ఆందోళన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పెద్ద సంఖ్యలో పోలీసులు రాజాసింగ్ నివాసానికి చేరుకుని ఆయనను అరెస్టు చేశారు. మునావర్ షో ను నిర్వహించవద్దని తాము డిమాండ్ చేసినప్పటికీ పోలీసుల రక్షణ మధ్య షో నిర్వహించడంపై రాజాసింగ్ తప్పుబడుతున్నారు. తాను ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని రాజాసింగ్ ప్రకటించారు. మునావర్ ఫరూఖీ .. శ్రీరాముడు, సీతలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. కానీ తాను మాత్రం ఎవరి పేరును తీసుకుని వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతీశాయని ఎంఐఎం ఆందోళన చేసింది. కాగా పోలీసుల విజ్ఞప్తి నేపథ్యంలో రాజాసింగ్ అప్ లోడ్ చేసిన వీడియోను యూట్యూబ్ తొలగించింది.
భారీ భద్రత నడుమ మునావర్ ఫారూఖీ కామిటీ షో విజయవంతం
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?