టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన జాతీయ పార్టీ విస్తరణ లో భాగంగా ఏపి నుండి పలువురు నేతలను పార్టీల్లో చేర్చుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఏపి శాఖకు తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడుగా నియమించారు. సంక్రాంతి పండుగ తర్వాత విజయవాడలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసిఆర్ పై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్శింహరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ పార్టీలు ఏపికి అవసరం లేదని అన్నారు. ఇక్కడి ప్రజలు కేసిఆర్ ను ఎందుకు సమర్ధించాలని ప్రశ్నించారు జీవీఎల్. గతంలో ఆంధ్ర ప్రజలను కేసిఆర్ తిట్టి, దుర్భాషలాడిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆంధ్రవాళ్లను తరిమి తరిమి కొడతామన్నందుకు సమర్దించాలా అని ప్రశ్నించారు.
కోవిడ్ సమయంలో ఏపి ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ వెళుతుంటే వాహనాలను రాష్ట్ర సరిహద్దులో ఆపిన విషయాన్ని గుర్తు చేశారు జీవీఎల్. ఆంధ్ర కు రావాల్సిన నీటిని సముద్రం పాలు చేస్తున్నాడని కేసిఆర్ ను విమర్శించారు. పోలవరం ఎత్తు తగ్గించాలంటూ సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించారు. ఏపిని ఎడారిలా మార్చాలనుకున్న కేసిఆర్ ఏపిలో ఎలా రాజకీయం చేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపికి రావాల్సిన నిధులను ఇంత వరకూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత కేసిఆర్ ఏపిలోకి అడుగు పెట్టాలని జీవీఎల్ అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం ఖాయమని జీవీఎల్ అన్నారు. తెలంగాణలో తన ప్రాభవాన్ని కోల్పోవడంతో జాతీయ పార్టీ అంటూ కేసిఆర్ కొత్త రాగం అందుకున్నారని జీవిఎల్ విమర్శించారు. ముందు తెలంగాణలో ఉన్న సమస్యలను పరిష్కరించాలనీ, ఆ తర్వాత ఆంధ్రను ఉద్దరించడానికి రావాలని జీవిఅర్ కోరారు. మరో పక్క పక్క తెలంగాణలో కేసిఆర్ తో జత కట్టిన వామపక్షాలు ఏపిలో ఎటువంటి స్టాండ్ తీసుకుంటాయి అనే దానిపై ఇంక స్పష్టత రాలేదు. కర్ణాటకలో జేడీఎస్ మద్దతుతో పోటీ చేస్తామని ఇంతకు ముందు కేసేఆర్ ప్రకటించారు. కానీ ఏపిలో రాజకీయం విషయంపై కేసిఆర్ ఇంకా ప్రకటన చేయలేదు.
YSRCP Internal: రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు మళ్లీ ఖాయమే ..! కానీ..?