BJP MP GVL: ఏపి సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత బియ్యం పంపిణీకి పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నా, ప్రజల దృష్టిలో కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు రాజకీయ కారణాలతో ఏపి రాష్ట్ర ప్రభుత్వం సరఫరాకు అంతరాయం కలిగించిందనీ, ఇది చాలా బాధాకరమని అన్నారు జీవిఎల్.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
BJP MP GVL: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ
ఏపిలో ఏప్రిల్, మే నెలలో ఉచిత బియ్యం ఇవ్వలేదని జీవిఎల్ ఆరోపించారు. నిధులు విడుదల చేయడం లేదని కేంద్రంపై ప్రభుత్వం నిందలు వేస్తూ రాజకీయ కుతంత్రం చేస్తుందని విమర్శించారు. ఉచిత బియ్యం పంపిణీ చేయకపోవడం వల్ల ఏపిలోని 2.68 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేసిన జీవిఎల్ .. ఈ అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు రాసిన లేఖను ట్యాగ్ చేశారు.
పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ఆరవ దశను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పొడిగించింది. పీఎంజీకేఎవై 5వ దశను మార్చి వరకూ ఉచిత బియ్యం పంపిణీ చేశారు. అయితే ఏప్రిల్, మే మాసాలకు సంబంధించి బియ్యం పంపిణీ ఏపి ప్రభుత్వం చేపట్టలేదు. దీనిపై జీవిఎల్ స్పందించారు.
YCP ప్రభుత్వం ఏప్రిల్, మే నెలలకు ఇప్పటివరకు PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం ఇవ్వకుండా కేంద్రం విడుదల చేయలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ రాజకీయ కుతంత్రాల వల్ల ఆంధ్రప్రదేశ్ లోని 2.68 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడడం దిగ్భ్రాంతికరం.@BJP4Andhra pic.twitter.com/K5ieQ9uNcl
— GVL Narasimha Rao (@GVLNRAO) May 23, 2022
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?