హైదరాబాద్: ఏపి రాజధాని అమరావతిలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ దృష్టికి బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీసుకువెళ్లారు. శుక్రవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సుమారు అరగంటకుపైగా జరిగిన వీరి భేటీలో ఏపి రాజధాని సమస్యలతో పాటు పలు విషయాలను రాష్ట్రపతి కోవింద్కు సుజనా చౌదరి వివరించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి ఏపి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పరిపాలనా రాజధానిని విశాఖకు, హైకోర్టును కర్నూలుకు మార్చవచ్చనే సంకేతాలను ముఖ్యమంత్రి జగన్ ఇచ్చారు. జిఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ కూడా పరిపాలనా వికేంద్రీకరణకు అనుగుణంగా నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. రాజధాని తరలింపు ప్రతిపాదనను సుజనా చౌదరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిఎం మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అయన ప్రశ్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతిని సుజనాచౌదరి కలిసి ప్రస్తుతం ఏపిలో నెలకొన్న పరిస్థితులు, రైతుల ఆందోళన తదితర విషయాలను వివరించినట్లు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?