TG Venkatesh: ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఓ స్థల వివాదంపై బీజేపీ రాయలసీమ ఎంపి టీజీ వెంకటేశ్ పై కేసు నమోదు అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఎంపీ టీజీ వెంకటేశ్ స్పందించారు. బంజారాహిల్స్ ఆస్తి వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని టీజీ స్పష్టం చేశారు. టీజీ విశ్వప్రసాద్ పేరు కూడా టీజీవీ కావడంతో పాటు వారు తమకు బంధువులు, తమ ప్రాంతం వారు కావడంతో తన ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్నారని అన్నారు. తొలుత ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదనీ, ఆ తర్వాత చేర్చారన్నారు. ఈ వ్యవహారంలో తనకు ప్రమేయం లేదని విశ్వప్రసాద్ పోలీసులకు తెలిపారన్నారు. ఆదోనీ ప్రాంతంలో టీజీ ఇంటి పేరుతో చాలా మంది ఉంటారని పేర్కొన్నారు టీజీ వెంకటేశ్. ఘటన జరిగిన రోజు తాను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ టూర్ లో భాగంగా లక్షద్వీప్ లో ఉన్నాననీ, విషయం తెలిసి అక్కడి నుండి ఫోన్ లో పోలీస్ అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు. తాను నిన్ననే బెంగళూరుకు వచ్చానని చెప్పారు. ప్రజలకు తెలియజేసేందుకు అంటూ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు టీజీ వెంకటేశ్.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
TG Venkatesh: భూ ఆక్రమణ వివాదంలో టీజీ వెంకటేశ్ పై కేసు నమోదు
బంజారాహిల్స్ రోడ్ నెం 10 లోని ఏపి జెమ్స్ అండ్ జువెలర్స్ కు సంబంధించిన స్థల వివాదం వ్యవహారంలో ఎంపీ టీజీ వెంకటేశ్ పేరును బంజారాహిల్స్ పోలీసులు చేర్చారు. ఏ -1 గా టీజీ విశ్వప్రసాద్, ఏ – 5 గా టీజీ వెంకటేశ్ ను పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 58 మందిని పోలీసులు అరెస్టు చేయగా మరి కొందరు నిందితులు పరారీలో ఉన్నారు. సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన సుమారు 90 మందితో బంజారాహిల్స్ రోడ్డు నెం.10లో స్థలాన్ని స్వాధీనాన్ని బలవంతంగా ఆధీనం చేసుకునేందుకు అక్కడి సెక్యురిటీ గార్డులతో ఘర్షణ పడిన నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు రాగానే కొందరు పరారు కాగా 58 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.