BJP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ గా పైకి రావటానికి బిజెపి BJP వచ్చిన ఏ అవకాశాన్నివదులుకోవడం లేదు. మొన్నటి వరకు దేవాలయాల విగ్రహాల ధ్వంసం విషయంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు, నిరసనలు చేపట్టడం అందరికీ తెలిసిందే. ఇటువంటి తరుణంలో చాలావరకూ మతాలను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేసేది దేశంలో ఒక బీజేపీ యే అనే విమర్శలు రావడం జరిగాయి. ఇదిలా ఉంటే ఈ ఘటనలో ఎక్కువగా టిడిపి వాళ్ల పేర్లు బయటపడటంతో, చాలా వరకు విగ్రహాల ధ్వంసం ఘటనకు సంబంధించి ప్రతిపక్షాలు సైలెంట్ అయిపోయాయి. కావాలనే టిడిపి పార్టీకి చెందిన వాళ్లే విగ్రహాల ను టార్గెట్ చేసుకుని మతాల మధ్య కులాల మధ్య గొడవలు సృష్టించి రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మరోపక్క వైసీపీకి చెందిన కీలక నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రంలో ఎదగాలనుకునే బీజేపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్లు అయింది. కేంద్రం తీసుకునే నిర్ణయం పై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు బగ్గు మంటున్నాయి.
కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు. ఒక విశాఖలో మాత్రమే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా కార్మిక సంఘాలు బిజెపి పార్టీ పై భగ్గుమంటున్నాయి. ఇటువంటి తరుణంలో ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ విషయంపై స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది పెద్ద ఉద్యమం అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఎమ్మెల్సీ మాధవ్ కలిశారని.. జీవీఎల్ నరసింహారావు కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఈ విషయంలో మరోసారి కేంద్రం ఆలోచించే విధంగా పెద్దలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మొత్తంమీద ఏపీలో ఎదగాలని అనుకుంటున్న బీజేపీకి కేంద్రం తీసుకున్న విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయం పెద్ద తలనొప్పి తీసుకువస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.