దక్షిణాదిలో పాగా వేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్న బిజెపికి తెలంగాణలో మెల్లమెల్లగా ట్రాక్ లో పడుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో అజయ్ కెలుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కూడా కొనసాగించాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ అధిష్టానం ఇప్పటి నుండే సరికొత్త వ్యూహాలతో రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో పలువురితో భేటీకానున్నారు. తాజా పరిణామాలు పార్టీ ఈసారి కచ్చితంగా డీఎంకే పార్టీ గెలవటం గ్యారెంటీ అనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పార్టీ ని చిత్తు చిత్తుగా ఓడించడానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు డీఎంకే మాజీ అధ్యక్షుడు అళగిరితో అమిత్ షా భేటి అవుతారని సమాచారం. అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించాలని రజినీని అమిత్ షా కోరుతారని తెలుస్తోంది. ఇదే టైములో స్టాలిన్ అన్న అళగిరిని బిజెపిలోకి ఆహ్వానించడానికి అమిత్ షా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి కీలక పాత్ర పోషిస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.