Black Fungus: కరోనా వస్తుంది..పోతోంది..ఇది పెద్ద ప్రాణాంతకమైన వ్యాధి కాదు. మరణాల సంఖ్య చాలా తక్కువ. కళ్ల ఎదురుగానే ఎంతో మంది కరోనా సోకిన వారు చికిత్స పొంది రోజుల వ్యవధిలోనే ఆరోగ్యవంతులు అవుతున్నారు. అయితే ఇప్పుడు కరోనా నుండి కోలుకున్న వారిలో కొందరికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయట పడుతుండటం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీని బారిన పడి వారు కంటి చూపును కోల్పోతున్నారు. పలు చోట్ల మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ (మ్యుకోర్మైకోసిస్)ని నోటిఫియబుల్ వ్యాధిగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ బాధిత, అనుమానిత కేసుల వివరాలను తప్పక ప్రభుత్వానికి అందించాలని కేంద్రం స్పష్టం చేసింది. దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ వ్యాధి పట్ల అప్రమత్తం అయ్యయి. ఏపి విషయానికి వస్తే… ఈ ఫంగస్ చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాష్ట్రం తీసుకువచ్చింది. అంతే కాకుండా రాష్ట్రంలో పలు కీలక ఆసుపత్రులలో బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కు ఏర్పాట్లు చేసింది.
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ చికిత్స చేసే ఆసుపత్రులు ఇవే..
అనంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)
ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్, తిరుపతి
స్విమ్స్, తిరుపతి
జీజీహెచ్ కాకినాడ
జీజీహెచ్, గుంటూరు
జీజీహెచ్ (రిమ్స్), కడప
జీజీహెచ్, విజయవాడ
ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి, కర్నూలు
జీజీహెచ్, కర్నూలు
జీజీహెచ్ (రిమ్స్), ఒంగోలు
జీజీహెచ్, నెల్లూరు (ఎసీఎస్ఆర్ ప్రభత్వ వైద్య కళాశాల)
జీజీహెచ్, శ్రీకాకుళం (ప్రభుత్వ వైద్య కళాశాల)
ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి, విశాఖపట్నం
ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి, విశాఖపట్నం
ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆసుపత్రి (ఆంధా వైద్య కళాశాల)
కేజీహెచ్, విశాఖపట్నం
విమ్స్, విశాఖపట్నం