Face Tips: ముఖంపై కనిపించే నల్లని మచ్చలు, చర్మంలో మెలనిన్ అధికం గా ఉత్పత్తి అవడం వలన వస్తాయి. ఎండలో ఎక్కువగా తిరగడం , గర్భధారణ , దీర్ఘకాలం గా మందులు వాడటం, నిద్రలేమి , విటమిన్స్ లోపం, మనసిక ఒత్తిడి వలన కూడా ఈ బ్లాక్ స్పాట్స్ ముఖంపై వచ్చే అవకాశం ఉంది . ఇవి ముఖంపై కనిపిస్తూ.. మీ అందాన్ని తగ్గిచేస్తాయి. వీటికోసం రసాయన క్రీం లు కన్నా కొన్ని ఇంటి చిట్కాలు చేసుకోవడం తో తొలిగిపోతాయి.
ఓట్స్ ను పౌడర్ గా చేసుకుని , అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి చేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత సబ్బుతో ముఖాన్నికడిగేసుకోవాలి.
ఈ చిట్కాతో ముఖంపై ఉండే డార్క్ స్పాట్స్ ను లైట్ గా మార్చడం తో పాటు మీ చర్మం తేమగా సాఫ్ట్ గా మారుతుంది. చర్మాన్ని కాపాడడం లో నిమ్మరసం బాగా పనిచేస్తుంది. ఇది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ కూడా. డార్క్ స్పాట్స్ ను తొలగించడం లో నిమ్మరసం ఎంతో బాగా పనిచేస్తుంది. నల్ల మచ్చలున్న చోట కొద్దిగా నిమ్మరసాన్ని పిండి సరిగా అప్లై చేసుకున్న తర్వాత ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన నల్లని మచ్చలు మాయమవుతాయి. చర్మానికి ఉపయోగపడే లాక్టిక్ యాసిడ్స్ మజ్జికలో సంవృద్ధిగా లభిస్తాయి. మజ్జిగ ను రోజూ వాడితే నల్ల మచ్చలు అస్సలు కనిపించవు. మజ్జిగలో కాటన్ బాల్ ముంచి దాన్ని ముఖం మీద నల్ల మచ్చలున్న చోట మర్దన చేసి కొద్ది సేపు ఆరనిచ్చి శుభ్రం చేసుకుంటే ముఖంపై ఉండే నల్ల మచ్చలు తగ్గుతాయి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది.చర్మ సౌదర్యాన్ని పెంచే వాటిల్లో కలబందకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కలబందలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది కాలిన గాయాలను సైతం త్వరగా మానేలా చేస్తుంది. దీనితో పాటు తెగిన గాయాలను , పగుళ్ళను త్వరగా మానిపోయే విధంగా చేస్తుంది. . కలబంద నల్ల మచ్చలను అద్భుతం గా మాయం చేస్తుంది. తాజాగా ఉండే కలబందను జ్యూస్ గా చేసి నల్ల మచ్చలపై రాసిఆరిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. దీని వలన కూడా మంచి ఫలితం ఉంటుంది.
బాదంలో విటమిన్ ఈ ఉండడం వలన ఇది చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. బాదంను రాత్రి నీళ్లలో నానబెట్టాలి. తర్వాత రోజు దాన్ని మెత్తని పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్ ను ఉదయం ముఖానికి పట్టించి ఆరిన తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇది డార్క్ స్పాట్స్ ను తగ్గించి చర్మాన్ని బ్రైట్ గా మెరిసేలా చేస్తుంది. బంగాళ దుంప రసం నల్లమచ్చలు, స్కిన్ ప్యాచ్ లను నివారించడంలో అద్భుతం గా పనిచేస్తుంది. బంగాళదుంప రసాన్ని మచ్చలపై రాసి అరనిచ్చిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం గా కడిగేసుకోవాలి.