దేశానికి వెన్నెముగా నిలుస్తున్న అన్నదాత పరిస్థితి నేడు ఆగమ్యగోచరంగా మారింది. నలుగురికి కుడుపు నింపుతూ తాను మాత్రం పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. అతి వృష్టి, అనా వృష్టి కాలాలతో అన్నదాత నష్టపోతూనే ఉన్నాడు. చేతి కొచ్చిన పంట భూమిపాలవ్వడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పంట మంచిగా పండి చేతికొచ్చినా మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర లభించిక అడుగడుగునా నష్టాన్ని చవిచూస్తూనే ఉన్నారు.
అది ఇలాగ ఉండే ఏ కాలంలో ఏ పంట వేయాలి.. పంట మార్పిడి పద్ధతులు చాలా మంది రైతులకు తెలియక నష్టపోతూనే ఉన్నారు. సరైన వ్యవసాయ పద్దతులు తెలియని రైతుల పరిస్థితి మరీ దారుణం. వారికి మెరుగైన ధాన్యం పండించే పద్దతులు తెలిపేవారు లేకపోవడంతో బతుకు జీవుడా అంటూ జీవిస్తున్నారు. చాలా మంది వ్యవసాయాన్ని కూడా మానేశారు. కాగా ఈ కరోనా కష్ట కాలం అందరినీ రోడ్డును పడేసింది. దాంతో చాలా మంది ఊర్లళ్లలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు.
కాని ఏ పంటలు వేస్తే నష్టం రాకుండా ఉంటుందో మాత్రం చాలా మందికి తెలియదు. ఈ కష్ట కాలంలో నల్ల గోధుమలు మార్కెట్ లో మంది గిట్టుబాటు ధర పలుకుతున్నాయి. అలాగే దీనికి మంచి డిమాండ్ కూడా ఉంది. ఈ పంటను పడిస్తే మంచి రాబడి పొందవచ్చని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. మామూలు గోధుమలతో పోలిస్తే నల్ల గోధుమలకు మార్కెట్ లో నాలుగు రెట్లు ధర ఎక్కువగా పలుకుతోంది. ఈ నల్ల గోధుమలకు క్వింటాల్ ధర రూ. 7 నుంచి 8 వేల వరకు పలుకుతోంది. కాగా సాధారణ గోధుమలు క్వింటాల్ కు రూ.2 వేలుగా చలామణిలో ఉంది.
ఈ నల్ల గోధుమలు ఎంతో ఉపయోగపడతాయి. అనేక వ్యాధులను నివారించడంటో ఈ గోధుమలు చాలా ఉపయోగకరం. అలాగే ఈ నల్ల గోధుమలల్లో ఐరన్ కూడా ఉంటుంది. దీనితో పాటుగా షుగర్, ఒబెసిటీ, బ్లడ్ ప్రెజర్ లాంటి వ్యాధులున్న వారికి ఈ గోధుమలు మంచి ఆహారంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ గోధుమలను పండించడానికి ఈ నవంబర్ నెలే అనుకూలం. మరికెందుకు ఆలస్యం ఒక సారి ఈ పంటను వేసి చూడండి.