విశాఖపట్నం నార్త్ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కి చుక్కలు చూపిస్తుంది అధికార పార్టీ వైసిపి. ముందు నుంచి అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే గంటకి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక మొత్తం డోర్స్ క్లోజ్ అయిపోయాయి. పార్టీ లోకి వద్దాము అనేక ప్రయత్నాలు చేసినా ఆయన రాకను విశాఖపట్టణానికి చెందిన కీలక వైసీపీ పెద్దలతో పాటు పార్టీలో జగన్ కి చేదోడువాదోడుగా ఉండే పార్టీ పెద్దలు కూడా అడ్డుకున్నట్లు టాక్.
ఇదిలా ఉండగా విశాఖపట్టణంలో అక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తిస్తూ.. భూములలో కట్టిన భవనాలను కూల్చి వేస్తూ వైసీపీ ప్రభుత్వం చకచకా ముందుకు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖపట్టణం టీడీపీ పార్టీకి చెందిన కీలక నాయకులు కొంతమంది పలు అక్రమణలు చేసినట్లు గుర్తించడంతో.. కూల్చివేత కార్యక్రమం స్టార్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడిగా పేరొందిన కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తి మంగమరి పేట వద్ద ఉన్న గో కార్టింగ్ ను ఆక్రమణ చేసినట్లు విశాఖ మున్సిపల్ అధికారులు గుర్తించడంతో పాటు సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారు అని తెలియజేస్తూ గో కార్టింగ్ ను విశాఖ మున్సిపల్ అధికారులు కూలుస్తున్నారు. ఈ క్రమంలో కాశీ విశ్వనాథ్ తమకు ఎలాంటి నోటీసు అందలేదని చెబుతూ వైజాగ్ ప్రొఫైల్స్ నుండి పదేళ్ల పాటు లీజుకు తీసుకున్నా అని, అయినా ఇది ప్రైవేటు భూమి అని క్లారిటీ ఇచ్చారు. కాగా పార్టీ మారద్దామని భావించిన గంటా శ్రీనివాస్ కి అధికార పార్టీ షాకుల మీద షాకులు ఇస్తున్న తరుణంలో.. మరోవైపు బీజేపీ లోకి వెళ్దాము అనుకున్న ఏపీలో భవిష్యత్తు లేకపోవడంతో, టిడిపి లోనే కొనసాగేలా నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.