బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ కు చెందిన మణికర్ణిక ఆఫీస్ ను కూల్చివేయడానికి బిఎంసి అధికారులు నోటీసులు జారీ చేసారు. నిన్న కంగనా రనౌత్ తన ఆఫీస్ లో బిఎంసి అధికారులు ఉన్నారని, తన ఆఫీస్ కూల్చివేతకు కుట్ర జరుగుతోందని వీడియో పోస్ట్ చేసింది.
నిన్న కార్యాలయ కొలతలు తీసుకున్న అధికారులు ఈరోజు కూల్చివేతకు నోటీసులు ఇచ్చారు. అయితే ఇదంతా కంగనా రనౌత్ మీద శివసేన కక్షపూరిత చర్యగా పలువురు భావిస్తున్నారు. ఇటీవలే ఆమె ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పోలుస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కంగనాకు చెందిన ఆఫీస్ లోకి రావడం గమనార్హం. గతంలో కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో ముంబై పోలీసులు న్యాయం చేయరని, అందుకే సీబీఐకు ఈ కేసు అప్పగించాలని ఆమె కోరింది.