Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమా ప్రాజెక్టులు లైన్ లో పెట్టడం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న “ఆచార్య” సినిమా షూటింగ్ దాదాపు సంవత్సరంన్నర పైగా జరుగుతూ ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే డైరెక్టర్ బాబీ సినిమాలు చిరంజీవి ఓకే చేయడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి “వీరయ్య” అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నట్లు తాజాగా ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాని తీయాలని బాబి అనుకుంటున్నట్లు, స్క్రిప్టు వర్క్ ఇప్పటికే కంప్లీట్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా మాత్రమే కాక లూసిఫర్, వేదాళం సినిమాని చిరంజీవి రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. లూసిఫర్ సినిమా మోహన్ రాజా దర్శకత్వం చేయనుండగా, వేదాళం సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చేస్తున్న కొరటాల శివ “ఆచార్య” మే 13వ తారీకు వేసవి కాలం సందర్భంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కూడా నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.
ఏది ఏమైనా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే కుర్ర హీరోల కంటే మరో సినిమాలకు సంబంధించి సినిమాలు సెట్స్ పైకి తీసుకు రావటంలో చిరంజీవి ముందుండటం విశేషం. బాబీ 2019 సంవత్సరంలో “వెంకీ మామ” అనే సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. వెంకటేష్ నాగ చైతన్య కలిసి నటించిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి పెద్దగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!