Bodhidharma: మనకి సెవెంత్ సెన్స్ సినిమాలో చైనాకి ప్లేగు వ్యాధి సోకినప్పుడు బోధిధర్మ రక్షించాడని చూపించారు కానీ అందులో వాస్తవం లేదు. బోధిధర్మ కొంతకాలం తన గురువుకు ఇచ్చిన మాట ప్రకారం చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసి ఆ తరువాత ఆయన భారతదేశానికి తిరిగి రావాలి అనుకున్న సమయంలో ఓ శిష్యుడు ఆయన ఆహారంలో విషం కలిపాడని తద్వారా ఆయన చనిపోయారని ఆయనని చైనాలోనే సమాధి చేశారని ఓ కధనం ప్రచారంలో ఉంది. కానీ నిజానికి బోదిధర్మ 170 ఏళ్ల వయస్సులో అనగా 536లో మరణించారట.
కానీ ఇక్కడ మరో విషయం ఏమిటంటే చైనా ప్రజలు బోదిధర్మ చనిపోయారంటే ఒప్పుకోరు. వారు ఇలా ఒప్పుకోకపోవడానికి ఒక కథ చాలా కాలం నుంచి ప్రచారంలో ఉంది. అదేమిటంటే…. అప్పటిలో చైనా ప్రజలు బోదిధర్మ చనిపోయారని భావిస్తున్న రోజుల్లో చైనా దేశ సరిహద్దుల్లో ఓ సైనికుడు బోధిధర్మ ఒకచేతితో బూటుపట్టుకుని వెళ్లడం చూశాడట. ఎక్కడికి వెళ్తున్నారు అని బోధిధర్మని ప్రశ్నించగా అందుకు ఆయన ‘నా స్వదేశానికి వెళ్తున్నా’ అని చెప్పారట.
అంతేకాకుండా బోధిధర్మ ఆ వ్యక్తికి మీ రాజు త్వరలోనే చనిపోతాడని చెప్తాడు. అలాగే నేను బ్రతికే ఉన్నాను అని చెప్తే నీకే ప్రమాదం అని హెచ్చరిస్తాడు. అయినా వినకుండా ఆ సైనికుడు జరిగినదంతా రాజుకి చెప్పగా కోపంతో ఆ రాజు సైనికుడిని బాధించమని ఆదేశిస్తాడు.. ఆ తరువాత ఆ రాజు బోధిధర్మ సమాధిని తవ్వమని ఆజ్ఞాపించగా అందులో బోధిధర్మ పార్థివదేహం లేదు. అంతేకాకుండా ఆ సమాధిలో ఒక్క బూటే ఉంటుంది. అలాగే ఇది జరిగిన కొద్ది రోజులకే రాజు కూడా మరణిస్తాడు. ఇక ఈ ఆధారాలను ఆధారం చేసుకుని అప్పటి నుంచి చైనా ప్రజలు బోదిధర్మ మరణించలేదని, ఆయన బతికే ఉన్నారని విశ్వసిస్తున్నారు. కానీ అసలు నిజం ఏమిటన్నది ఇంకా మిస్టరీ గానే మిగిలి ఉంది.
గమనిక: మాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మరియు చారిత్రక ఆధారాలను ఆధారంగా చేసుకుని ఈ కథనాన్ని మీకు అందిస్తున్నాం.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.