(తిరుమల నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తిరులమ శ్రీవారి ఆలయంలోని ప్రసాదాల తాయారు చేసే పోటులో తరచు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పోటులో ఉన్న బాయిలర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ అధికారులు హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రసాదాలు తయారు చేసే వకుళామాత పోటులో ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమదం జరిగిన సమయంలో సుమారు 40 మంది కార్మికులు విదుల్లో ఉన్నట్లు సమాచారం.
పులిహోర ప్రసాదం తయారీ కోసం చింతపండు రసం వేడి చేస్తున్న సమయంలో బాయిలర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనతో అక్కడ ప్రసాదం తయారీని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇంతకు ముందు బూందీ పోటులో చాలా సార్లు ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల నివారణకు టీటీడీ అధికారుుల జాగ్రత్తలు పాటిస్తున్నా తరచు ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తున్నది.