బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి తెలిసిందే కదా. తను మనసులో ఏదీ దాచుకునే రకం కాదు. ఎదుటి వాళ్లు ఎవ్వరైనా సరే.. ఎంతటి వాళ్లయినా సరే.. మొహం మీదే అనేస్తుంది. తర్వాత బాధపడుతుంది. ఈమధ్య సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపైనా, నెపోటిజంపైనా పోరాటం చేసింది.
బాలీవుడ్ లో ఉన్న అనేక సమస్యలపై కూడా కంగనా చాలాసార్లు పోరాడింది. నెపోటిజానికి వ్యతిరేకంగా తాను అడుగు వేస్తే తనకు కోట్ల మంది మద్దతు పలికారు.
అయితే.. ఇటీవల కంగనా మహారాష్ట్ర సీఎం కొడుకుపై విమర్శలు చేసింది. అదే ఇప్పుడు తనకు లేనిపోని తలనొప్పి తెచ్చి పెట్టింది.
అసలు నువ్వు సినీ పరిశ్రమలో ఎందుకు వేలు పెడుతున్నావు. బాలీవుడ్ కు నీకు ఏంటి సంబంధం.. నువ్వు ఎవ్వరినైతే కాపాడాలని అనుకుంటున్నావో… వాళ్లు శిక్షను అనుభవించాల్సిందే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నువ్వు వాళ్లను కాపాడలేవు. వాళ్లకు శిక్ష తప్పదు.. అంటూ సీఎం కొడుకుపై ఫైర్ అయింది.
కంగనా ఇలా ఎవ్వరితో పడితే వాళ్లతో గొడవ పడితే తన ప్రాణాలకు ఏదైనా జరగరానిది జరిగితే ఎలా అని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తెగ భయపడుతున్నారట. ప్రతి విషయంలో వేలు పెడుతుంటే ఎవరో ఒకరు ఆమెను చంపే ప్రయత్నం చేస్తారని బెదిరిపోతున్నారట. అందుకే.. కంగనాను కాపాడుకోవడం కోసం… ఆమె తల్లి ఇటీవలే మృత్యుంజయ హోమాన్ని నిర్వహించిందట. కంగనాతో ఆ హోమాన్ని చేయించిందట. అలా అయినా తన ప్రాణాలకు ఉన్న ముప్పు పోతుందన్న ఆశతో ఆ హోమాన్ని చేయిస్తే.. తల్లి కోరిక మేరకు కంగనా కూడా ఆ హోమాన్ని చేసిందట.
మా అమ్మ కోరిక మేరకు నేను మృత్యుంజయ హోమం చేశాను. హోమంలో భాగంగా లక్షా పదివేల సార్లు నేను మృత్యుంజయ మంత్రాన్ని జపించాను. అమ్మ నా ప్రాణాలకు ఏదో ముప్పు ఉందని భయపడుతోంది.. తన మాటను కాదనలేకపోయాను.. అంటూ ఆ హోమానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కంగనా.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!