Shilpa Shetty: అవును.. ఈ మధ్య శిల్పా శెట్టి టైం అస్సలు బాగాలేదు. నిన్న మొన్నటి వరకూ దర్జాగా బాలీవుడ్లో తిరిగిన శిల్పాకు నేడు పరిస్థితులు అడ్డం తిరిగాయి. బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఆమె భర్త అయినటువంటి రాజ్కుంద్రా ఓ అశ్లీల వీడియో కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రుణం తిరిగి చెల్లిందలేదన్న ఆరోపణలపై ముంబైలోని అంధేరీ కోర్టు శిల్పాశెట్టికి సమన్లు జారీ చేయడం గమనార్హం.
Diabetes: షుగర్, కొలెస్ట్రాల్, బరువు తోపాటు ఈ సమస్యలకు ఒక చెంచా గింజలు చాలు..!!
Shilpa Shetty: ఇదే కేసులో ఆమెకు సమన్లు జారీ అయ్యాయి!
ఇక ఆ కేసు వివరాల్లోకి వెళితే.. శిల్పాశెట్టి తండ్రి అయినటువంటి సురేంద్ర శెట్టి ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని నుంచి 2015వ సంవత్సరంలో రూ.21 లక్షల వరకూ రుణం పొందారు. ఒప్పందంలో భాగంగా రుణం తిరిగి సరిగ్గా 2017 జనవరి నాటికి చెల్లిస్తానని మాట ఇచ్చి యున్నారు. కాగా, దురదృష్టవశాత్తూ సురేంద్ర శెట్టి 2016, అక్టోబర్ 11న మృతి చెందారు. కాగా ఈ విషయం శిల్పాశెట్టితో పాటు ఆమె తల్లికి తెలిసినప్పటికీ డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారని ముంబైకి చెందిన వ్యాపారవేత్త పర్హద్ అమ్రా ఆరోపించారు.
KCR: కేసిఆర్ టార్గెట్ ఫిక్స్…మోడీ సర్కార్ పై సంచలన కామెంట్స్…
అంధేరీ కోర్టు ఆదేశం:
ఈ విషయమై గత శుక్రవారం జుహూ పోలీస్ స్టేషన్లో శిల్పా కుటుంబంపై ఫర్హాద్ ఫిర్యాదు చేయగా.. శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి షమితాశెట్టి, తల్లిపై కేసు నమోదు అయింది. దీంతో ఈ నెల 28న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. అందువలన ఈ విషయమై, శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి షమితాశెట్టి, తల్లి సునందశెట్టి సైతం కోర్టుకి హాజరు కావాల్సిందిగా కోర్టు తీర్మానించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?