పశ్చిమబెంగాల్, జనవరి 9: పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలోని ఉత్తర పరగణా జిల్లాలో రైల్వే ట్రాక్పై పెట్టిన బాంబును రైల్వే అధికారులు గుర్తించి తొలగించారు. అశోక్ నగర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే పట్టాల కింద గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం బాంబు పెట్టారు. స్థానిక ప్రజల ద్వారా ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. రైళ్ళ రాకపోకలను నిలిపివేశారు.
బాంబు నిరోధక సిబ్బంది రంగంలోకి దిగి పట్టాల కింద అమర్చిన బాంబును తొలగించి నిర్వీర్యం చేశారు. బాంబు తొలగించిన తర్వాత రైళ్ళను యధావిధిగా నడిపినట్లు తూర్పు రైల్వే సిపిఆర్ఓ నిఖిల్ కుమార్ తెలిపారు.
previous post
next post