ముంబై పోలీసులు మంగళవారం ఉదయం నుండి తాజ్ హోటల్ బయట ఎన్నడూ లేని విధంగా విపరీతమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది. అందుకు కారణం కరాచీ నుండి లష్కరే-ఇ-తోయిబా (పోలీసుల అనుమానం) వారు ముంబైలోని తాజ్ హోటల్ ను బాంబులతో పేల్చేస్తామని ఒక బెదిరింపు ఫోన్ కాల్ చేయడమే. సోమవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిసింది.
అవతలి నుండి ఒక వ్యక్తి ఫోన్ లో మాట్లాడుతూ “ఈరోజు పాకిస్థాన్ లోని కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ లో జరిగిన ఉగ్రవాదుల అటాక్ ని చూశారు కదా. ఈసారి మరలా ముంబై లోని తాజ్ హోటల్ లో 26/11 అటాక్ పునరావృతం అవుతుంది” అని చెప్పినట్లు సమాచారం. ఇక రెండవ బెదిరింపు కాల్ కూడా తాజ్ హోటల్ వారికే చెందిన బాంద్రాలోని మరొక తాజ్ ల్యాండ్ హోటల్ స్టాఫ్ కు వచ్చిందట. ఈ రెండవ బెదిరింపు ఫోన్ కాల్ కూడా పాకిస్తాన్ నుండి వచ్చినట్లు చెబుతున్నారు.
దీనితో పోలీసులు ఆ రెండు హోటల్స్ లో ఉన్న స్టాఫ్ వద్ద స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత భారీ స్థాయిలో భద్రత బలగాలను రెండు హోటళ్ళ చుట్టూ మోహరించారు. మనం ఒకసారి నవంబర్ 26, 2008 లో తాజ్ హోటల్ లో జరిగిన అమానుషాన్ని గుర్తు తెచ్చుకున్నట్లయితే పాకిస్తాన్ నుండి బాగా శిక్షణ తీసుకున్న 10 మంది టెర్రరిస్టులు 166 మందిని చంపగా 300 మంది గాయాలపాలయ్యారు. దాదాపు 60 గంటలపాటు ఈ దాడి జరగడం గమనార్హం. ఇక ఉగ్రవాదులందరినీ భారత పోలీసులు మట్టుబెట్టగా కసబ్ అనే ఉగ్రవాదిని మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు. అతనిని 2012లో ఉరి తీయడం జరిగింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?