Breaking: తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళుతున్న కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. కొద్ది నిమిషాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రావాల్సి ఉన్న సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి కృష్ణా ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో బాంబు పెట్టినట్లు ఫోన్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. కృష్ణా ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను మౌలాలి రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేసి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తొంది. ఇది ఆకతాయులు చేసిన పని అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నా ముందస్తు చర్యలో భాగంగా రైలును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఒక్క సారిగా పెద్ద ఎత్తున రైల్వే పోలీసు బలగాలు కృష్ణా ఎక్స్ ప్రెస్ ను తనిఖీలు చేస్తుండటంతో ప్రయాణీకులు ఆందోళనకు గురైయ్యారు. సికింద్రాబాద్ నుండి గమ్యస్థానాలకు వెళ్లాల్సిన కొందరు ప్రయాణీకులు మౌలాలిలోనే దిగి ఇంటి మార్గం పట్టారు.