ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున ఎన్నికైన మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో పార్లమెంటులో అడుగు పెట్టడం చిరకాల కోరిక అని, ఆ కోరిక ఇప్పుడు వైయస్ జగన్ దయవల్ల తీరింది అని చెప్పుకొచ్చారు. ఏడాది కాలంలో తన చేసిన పని తానకి సంతృప్తినిచ్చిందని ఈ టైములో రాజ్యసభలో అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు విషయంలో అందరితో కలిసి పోరాడతామని, ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా గత ఎన్నికల టైంలో ప్రత్యేక హోదా రాష్ట్రానికి తీసుకు వచ్చే వరకు కేంద్రం పై పోరాటం ఆగదు అని జగన్ చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత గెలిచిన తర్వాత బీజేపీకి మన తో పనిలేదు వాళ్లకి వాళ్లే గవర్నమెంట్ ఫామ్ చేశారు. ప్రత్యేక హోదా గురించి అడగడం తప్ప పోరాడే స్థాయి మన దగ్గర లేదు అన్నట్టు జగన్ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో రాజ్యసభకు వెళుతున్న సందర్భంలో మీడియా ప్రతినిధులు సుభాష్ చంద్రబోస్ ని ప్రత్యేక హోదా గురించి ఏ విధంగా పోరాటం చేస్తారు అని అడుగగా, ప్రత్యేక హోదా వస్తుంది అనే నమ్మకం తనకు లేదు అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. డిప్యూటీ సియం హోదాలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రత్యేక హోదాకి బదులు వేరేది ఏదో ఇస్తారు కేంద్ర పెద్దలు అంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మాజీ డిప్యూటీ సీఎం బోస్ చేసిన వ్యాఖ్యలు బట్టి వైయస్సార్ సిపి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మాదిరిగానే ప్రత్యేక హోదా విషయంలో చేతులెత్తేసినట్లే అని జనాలు ఫిక్స్ అయిపోతున్నారు.