Nagarjuna: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంది. ఇటువంటి తరుణంలో సినిమా యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కింగ్ నాగార్జున సినిమా విజయం సాధించడం పట్ల సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
చైతు నటన నీ.. మరో లెవెల్ లోకి శేఖర్ కమ్ముల తీసుకెళ్లినట్లు ఆయనను ప్రశంసించారు. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం తుఫాను సమయంలో తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమ నగర్ సినిమా.. రిలీజ్ అయిన తేదీ నాడే ఈ లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వటం తనకు ఎంతగానో సంతోషం కలిగించిందని నాగార్జున చెప్పుకొచ్చారు. ఇక స్పీచ్ చివరిలో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటివరకు… ఇండస్ట్రీకి ఎంతగానో సహకారం అందించాయి.
అదే సహకారం భవిష్యత్తులో కూడా అందించాలని.. నాగార్జున కోరారు. కరోనా హ్యాండిల్ చేయడంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని నాగార్జున తెలిపారు. ఈ మహమ్మారి వైరస్ తో చక్కగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోరాడారని సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారని ప్రజలను కాపాడటంలో కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. ఇప్పటివరకు ఇండస్ట్రీని చల్లగా చూశారు… రాబోయే రోజుల్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల బ్లెస్సింగ్స్ ఇండస్ట్రీకి అవసరమని నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు.