టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల మధ్య ఉన్న అనుబంధం ఒక్కోక్కరితో ఒక్కోరకంగా ఉన్నా అందరు కలిసినప్పుడు మాత్రం వారి మధ్య ఎలాంటి విభేధాలు లేవన్నట్లుగా కలిసిపోయి కనిపించడం చాలా సందర్భాల్లో చూసిందే. అయితే ఇప్పటికి ఎవరికి అర్ధం కాని మిత్రులు ఈ సీనియర్ హీరోల్లో ఉన్నారు. వారే మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇక ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరి మధ్య దశాబ్దాలుగా మంచి బంధమే కొనసాగుతోంది. కాని ఎవరికి అర్ధం కాదు. ఎందుకంటే పబ్లిక్ లోనే ఒకరిపై ఒకరు మాటలు విసిరేసుకుంటారు. అంతలోనే మళ్ళీ ఇద్దరూ ఒకటే అనే రేంజిలో వాటేసుకొని ముద్దులు పెట్టేసుకుంటారు.
వీరి అన్యోన్యత ప్రేక్షకులకు కూడా సరదాగానే అనిపిస్తుంది. ఇలా వీరు ఎన్నో సార్లు వివాదస్పదంగా ప్రవర్తించారు. అంతలోనే కలిసిపోయారు. ఇక ఈ మధ్య మోహన్ బాబు చిరు బర్త్ డే కి అదిరిపోయే గిఫ్ట్ అందించిన సంగతి తెలిసిందే. వీరితో పాటు నెక్స్ట్ జనరేషన్ మెగా, మంచు హీరోల మధ్య కూడా మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఇకపోతే తమ కెరీర్ తొలినాళ్ళలో వెండితెరపై చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ విలన్ పాత్రల్లోనే నటించారు. తరువాత ఇద్దరూ హీరోలుగా తమ సత్తా చాటుకున్నారు.
చిరంజీవి హీరోగా చేసిన సినిమాల్లో విలన్ గా మోహన్ బాబు చాలా చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫ్రెండ్స్ ఫరెవర్ అంటూ మోహన్ బాబు, చిరంజీవిని కలవడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రంలో నటిస్తున్నారు. కాగా మోహన్ బాబు హైదరాబాద్ లో జరుగుతున్న ‘ఆచార్య’ సెట్స్ కి విచ్చేసి చిరు కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకముందు లా కాకుండా ఇప్పుడు ఈ సీనియర్ స్టార్ హీరోలు కలిసి పోవడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది. ఇండస్ట్రీకి ఇదే కదా కావాల్సింది.