జగన్ క్యాబినెట్ లో సీనియర్ మంత్రి బొత్స ఇటీవల మీడియా ముందు పార్టీకి సంబంధించిన నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల విషయంలో స్పందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చే ఏడాది అయిన సందర్భంలో నెల్లూరు, గుంటూరు మరియు విశాఖ జిల్లాకు చెందిన నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయటం ఇటీవల ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయిన విషయం అందరికి తెలిసిందే.
ఆనం నారాయణ రెడ్డి అదే విధంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అధికారంలోకి వచ్చినా నియోజకవర్గాల అభివృద్ధి జరగడం లేదు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రభుత్వం పై పోరాటాలు చేయాల్సి వస్తోంది అంటూ ప్రభుత్వం పైన ఘాటైన విమర్శలు చేయడం మనం అందరం చూశాం. ఈ విమర్శలకు ప్రతిపక్షాల నుండి కూడా ప్రభుత్వంపై సెటైర్లు పడ్డాయి. కానీ ఇప్పటివరకు వైసీపీ పార్టీ నుండి ఎవరు ఈ విషయంలో స్పందించలేదు. తాజాగా బొత్స ఈ విషయం గురించి మాట్లాడుతూ పార్టీలో అసమ్మతి ఉన్నది వాస్తవమే కానీ అనుకున్నంత స్థాయిలో లేదు అన్నట్టుగా… చాలా ఈజీగా తీసిపారేసినటు బొత్స కామెంట్లు చేశారు.
ఈ నేపథ్యంలో బొత్స నేరుగా మీడియా సమావేశంలో ఈ విధంగా మాట్లాడటంతో విశ్లేషకులు ఖచ్చితంగా పార్టీలో అసంతృప్తి ఉండబట్టే ఆయన నేరుగా మీడియా ముందు మాట్లాడటం జరిగింది అని విశ్లేషిస్తున్నారు. ఇదే కొనసాగితే రాబోయే నాలుగు సంవత్సరాలలో పార్టీలో అధిష్టానంపై మరింత మంది నేతలు ఎదురుతిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.