కరోనా కారణంగా బుక్కులతో స్కూల్లకు వెళ్లి చదవాల్సిన విద్యార్థులు స్మార్ట్ ఫోన్లలో చదవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విచిత్రం ఏమంటే అసలు అందులో పిల్లలకు ఎంత వరకు అర్థమవుతుందో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాని అందరికీ స్మార్ట్ ఫోన్లు కొనే స్తోమత లేదనేది అందరికీ తెలిసిన విషయమే.. కాగా ఓ తల్లి తన కొడుకు కోసం స్మార్ట్ ఫోన్ కొనిచ్చి పోలీస్ స్టేషన్ కెళ్లొచ్చింది. అంటే ఆమెదో ఫోన్ ను దొంగతనం చేసిందనుకుంటే పొరపాటే సుమా..
తన కొడుకు ఆన్లలైన్ ద్వారా చదవుకోవడం కోసం ఎంతగానో కష్టపడి స్మార్ట్ ఫోన్ ను కొనుక్కొచ్చింది. మరెందుకు పోలీసులు జైలుకు తీసుకెళ్లారు అనుకుంటున్నారు కదా.. దానికీ కారణం లేకపోలేదు.. మరి అదేంటో ఈ ఆర్టికల్ ను చదివేసి తెలుసుకోండి…ఎంతో గారాబంగా పెంచుకున్న కుమారిడి కోసం తన చదువుకు బంగం వాటిళ్లకూడదని ఓ తల్లి తన కొడుకు కోసం స్మార్ట్ ఫోన్ ను బహుమతిగా ఇచ్చింది.
కాని ఆ స్మార్ట్ ఫోన్ కారణంగా ఆ తల్లి ఒక రోజు మొత్తం స్టేషన్ లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ముంబైలో ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబై, బోరివ్లీకి చెందిన స్వాతి సుభాష్ తన కొడుకు సావ్రే అన్ లైన్ చదువుల కోసం స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని మూడు నెలల పాటు కష్టపడి డబ్బులను కూడబెట్టింది. ఆ మేరకు ఆమె తన కొడుకు కోసం నెల రోజుల కిందట రూ.6000 లతో సెకండ్ హ్యాండ్ ఫోన్ ను కొన్నది. కాగా దాని రిపేర్ల కోసం అదనంగా 1,500 రూపాయలను కూడా ఖర్చు చేసింది.
దాంట్లో ఆమె కొత్త సిమ్ ను వేసి వాడకం మొదలు పెట్టారు. కాగా రెండో రోజు పోలీసులు తన ఇంటి ముందు దిగారు. ఆ ఫోన్ దొంగింలించినదని స్వాతిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఒక రోజంతా ఆమెను కస్టడీలోనే ఉంచారు. కాగా ఆమెను విచారించిన పోలీసులు ఆమె తప్పేంలేదని ఆమెను పోలీసులు విడుదల చేశారు. కాగా తన కుమారిడు చదువుకోవడానికి ఫోన్ కొనివ్వడానికి ఆమె ఎంత కష్టపడి పనిచేసిందో గుర్తించి ఉన్నతాధికారులు ఆమెకు కొత్త ఫోన్ ను బహుమతిగా అందించారు.