ఇండోర్: ఆరేళ్ల కుర్రాడి మలద్వారం గుండా అతని స్నేహితులు ఎయిర్ కంప్రెసర్తో శరీరంలోకి గాలి పంపించారు. ఆ పిల్లవాడు ప్రాణం కోల్పోయాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో జరిగిందీ సంఘటన. ఆడుకుంటూ ఆడుకుంటూ ఈ పని చేసిన కుర్రవాడి స్నేహితులు కూడా దాదాపు అతని వయస్సు వారే.
కన్హా యాదవ్ అనే పిల్లవాడి తండ్రి పాల్దా పారిశ్రామికవాడలోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. అక్కడే పిల్లలు ఆడుకుంటూ ఈ ఆకతాయి పని చేశారు. కన్హా పురీషనాళంలోకి కంప్రెసర్ నాజిల్ చొప్పించి గాలి వదిలారు. అతని పొట్ట ఉబ్బిపోవడంతో భయపడి ఇంటికి తీసుకువెళ్లారు. కన్హా తండ్రి వెంటనే పిల్లవాడిని ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ కన్హా మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపామనీ, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్య తీసుకుంటామనీ పోలీస్ ఇన్స్పెక్టర్ సంజయ్ శుక్లా తెలిపారు.