నిజంగా ఈ దేశంలో ఒక రైతు వచ్చే కష్టం ఇంకెవ్వరికీ రాదు. లక్షల పెట్టుబడి పెట్టి పంట వేస్తాడు. తీరా అది చేతికొచ్చే సమయానికి నేలపాలు అవుతుంది. లక్షల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సమయానికి వర్షాలు రావు. వద్దంటే వస్తాయి.. పొలాలను ముంచెత్తుతాయి. పొలాలను నాశనం చేస్తాయి. మరి.. ప్రభుత్వాలు ఏం చేస్తాయి.. ఏ ప్రభుత్వం వచ్చినా.. ఏదో అప్పటికప్పుడు హడావుడి చేయడమే తప్పితే రైతు సమస్యలను శాశ్వతంగా తీర్చడానికి ఏ ప్రభుత్వమూ ముందుకు రాదు. అందుకే రైతు కష్టాలు ఇంకా అలాగే ఉంటున్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. అందులో ఓ చిన్నారి మెడలోతు నీటిలోకి దిగి.. ప్రభుత్వానికి విన్నవిస్తున్నాడు. ఆ పిల్లాడు చెరువులోకి దిగాడేమో అని అనుకునేరు. అది వాళ్ల పొలం. అవును.. భారీ వర్షాలకు వాళ్ల పొలం అంతా నీటితో నిండిపోయి చెరువులా మారిపోయింది. ఇంకో నెల రోజుల్లో చేతికొస్తుందనుకున్న 6 ఎకరాల పొలం మొత్తం నీటిలో మునిగిపోయింది.
దీంతో కనీసం ఇకనైనా ఇలా వర్షపు నీరు రాకుండా చూడండి ప్లీజ్ అంటూ ప్రభుత్వాన్ని మొర పెట్టుకున్నాడు ఆ పిల్లాడు. ఈ మధ్య తెలంగాణలో భారీ వర్షాలు పడ్డ సంగతి తెలిసిందే కదా. అప్పుడే ఈ పొలం ఇలా చెరువులా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన చిన్నారి ఇలా వినూత్నంగా ఆలోచించి ఈ వీడియోను చేయగా.. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్ని ప్రభుత్వాలు మారినా.. రైతుల బతుకులు మాత్రం మారవా ఇక.. అంటూ నెటిజన్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ పిల్లాడు ప్రభుత్వానికి ఏం మొర పెట్టుకున్నాడో మీరే ఈ వీడియోలో చూడండి..
I request the collector of Yadadri to follow up and this and solve to the best.See the maturity of child..Let’s all make a hand to help him.. @Collector_YDR @KVishReddy @KomatireddyKVR @kumbam_anil pic.twitter.com/Om3CDEF6Js
— Paka Vijay (@PakaVijay) September 20, 2020