Gopichand : కెరీర్ ప్రారంభంలో యూత్ కోసమే సినిమాలు తీసి సక్సెస్ అందుకున్న దర్శకుడు మారుతి ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కమర్షియల్ దర్శకుడిగా టాలీవుడ్ లో బాగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మారుతి. నాని, శర్వానంద్ లకి హిట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ గత చిత్రం ప్రతి రోజు పండుగే సినిమాతో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కి మంచి కమర్షియల్ హిట్ ఇచ్చాడు. కరోనా కారణంగా మారుతికి కాస్త గ్యాప్ వచ్చింది. అయితే కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత మాచో హీరీ గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ అనే మంచి మాస్ ఎంటర్టైనర్ సినిమాను ప్రకటించాడు.
ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇందులో గోపీచంద్ కి జంటగా బబ్లీ బ్యూటీ రాశిఖన్నా నటిస్తోంది. వీరిద్దరు ఇందులో లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే కొన్ని కీలకమైన కోర్ట్ సన్నివేశాలను చిత్రీకరించారు. శరవేగంగా షూటింగ్ సాగిన నేపథ్యంలో ఈ పక్కా కమర్షియల్ సినిమాను అక్టోబర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక సీటీమార్ కంప్లీట్ చేసిన గోపీచంద్ ఆ సినిమా రిలీజ్ కి కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. అయితే పక్కా కమర్షియల్ సినిమాతో పాటు సీటీమార్ సినిమాతోను బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సక్సెస్ అందుకోవాలనుకున్నాడు.
Gopichand : గోపీచంద్ సినిమాకి బ్రేక్ పడిందని సమాచారం.
ప్రేక్షకుల్లో మారుతి సినిమాకి మంచి ఆదరణ ఉంది. అందుకే మారుతితో సినిమా చేసేందుకు టాలీవుడ్ హీరోలు రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాకి బ్రేక్ పడిందట. అందుకు కారణం మారుతి మరో సినిమా చేయాలని కమిటవడమే. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో యంగ్ హీరో సంతోష్ శోభన్ తో ‘మంచి రోజులు వచ్చాయి’ అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను కూడా చిత్ర బృందం రిలీజ్ చేశారు. ఇందులో యంగ్ బ్యూటి మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసి రిలీజ్ చేయనున్నారట. అందుకే గోపీచంద్ సినిమాకి బ్రేక్ పడిందని సమాచారం.